Pakistan: పాక్ ప్రజల నోట ‘చౌకీదార్ చోర్ హై’..!
ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా పాకిస్థాన్ ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ‘చౌకీదార్ చోర్ హై(కాపలాదారు ఒక దొంగ)’ అంటూ నినాదాలు వినిపించాయి.
ఇంతలా జనాలు ఎన్నడూ వీధుల్లోకి రాలేదు: ఇమ్రాన్
ఇస్లామాబాద్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ఖాన్కు మద్దతుగా పాకిస్థాన్ ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ‘చౌకీదార్ చోర్ హై(కాపలాదారు ఒక దొంగ)’ అంటూ నినాదాలు వినిపించాయి. ఆ సమయంలో పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతుండగా.. అక్కడున్న పాకిస్థానీలు ఈ కామెంట్ చేశారు. ఇమ్రాన్ను తొలగించడంలో వెనకుండి నడిపించిన పాక్ సైన్యాన్ని ఉద్దేశించి ఈ నినాదం చేసినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి నినాదాలు చేయొద్దని, శాంతితో పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈ నెలలో పరిస్థితులు మారతాయని, దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దిగిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
భారత్లో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార భాజపాకు వ్యతిరేకంగా ఈ ‘చౌకిదార్ చోర్ హై’ నినాదం చేసింది. ఈ విషయంలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కార ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆ కేసు విచారణ ముగిసిపోయింది.
ఇంతలా జనాలు ఎన్నడూ వీధుల్లోకి రాలేదు: ఇమ్రాన్
మరోపక్క తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం కృతజ్ఞతలు తెలియజేశారు. ‘అమెరికా మద్దతుతో జరుగుతోన్న పాలన మార్పునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న పాకిస్థాన్ పౌరులకు ధన్యవాదాలు. జైలుకు వెళ్లివచ్చిన వారిని అధికారంలోకి తీసుకురావడానికి స్థానికంగా కొందరు సహకరిస్తున్నారు. ఈ తీరును స్వదేశం, విదేశాల్లోని పాకిస్థానీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోసగాళ్ల నేతృత్వంలో దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ..ఈ స్థాయిలో జనాలు ఎప్పుడూ బయటకు రాలేదు’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిరసనల వీడియోను షేర్ చేశారు.
శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ప్రధాని పదవి కోల్పోయారు. తన పదవికి ఎసరు రావడం వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపించిన ఇమ్రాన్.. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. పదవి కోల్పోయిన వెంటనే చేసిన మొదటి ట్వీట్లోనూ ఆ రాగమే తీశారు. ‘1947లో పాకిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ దేశంలో మరోసారి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. ఈ సారి ప్రభుత్వ మార్పుకోసం జరిగిన విదేశీ కుట్రలపై! దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎప్పుడూ ప్రజలే’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM