AirIndia: ఎయిర్‌ ఇండియా విమానంలో పాము కలకలం

ఎయిర్‌ఇండియా విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని సిబ్బంది గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది.

Published : 11 Dec 2022 01:34 IST

దిల్లీ: ఎయిర్‌ ఇండియా(AirIndia) విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్‌(Dubai) ఎయిర్‌పోర్టు(Airport)లో ల్యాండ్‌ అయిన తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. కోల్‌తా నుంచి కేరళ మీదుగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. చివరిగా కార్గో కేబిన్‌ను చెక్‌ చేస్తుండగా పాము కనిపించింది. దీంతో అత్యవసర సిబ్బంది వచ్చి దానిని బయటకి తీశారు. అయితే, కార్గో క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చి చేరిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్‌ ఇండియా అధికారులు వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని