USA: మంచు తుపాను గుప్పిట అమెరికా.. క్రిస్మస్ వేళ వేలాది విమానాలు రద్దు!
మంచు తుపాను ధాటికి అమెరికాలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల తక్కువకు పడిపోయాయి. క్రిస్మస్ సంబరాల వేళ ఈ వాతావరణం పౌరులకు ఇబ్బందికరంగా మారింది.
వాషింగ్టన్: శీతాకాలపు మంచు తుపానుతో అమెరికా(America) గజగజ వణికిపోతోంది! భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయాయి. క్రిస్మస్(Christmas) సమీపిస్తోన్న వేళ పండగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులనూ మూసివేశారు. మధ్య అమెరికాలో లక్షలాది పౌరులకు హిమ తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మిన్నియాపొలిస్, సెయింట్ పాల్, న్యూయార్క్, షికాగో తదితర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
మోంటాన, మిన్నెసోటల్లో.. బయటి వాతావరణం చాలా చల్లగా ఉందని, జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం అమెరికన్లకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ‘ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులా కాదు. చాలా తీవ్రమైన పరిస్థితి’ అని విలేకరులతో అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ‘బాంబు సైక్లోన్’గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్(AccuWeather) సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్.. ఇతర ప్రాంతాల గవర్నర్లతో కలిసి స్థానికంగా ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.
దట్టమైన పొగ మంచుతోపాటు వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నందున.. ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రహదారి ‘ఇంటర్స్టేట్-90’ని సౌత్ డకోటాలో మూసివేశారు. ఇలా అనేక ఫ్రీవేలను ప్రస్తుతం ప్రయాణించేందుకు అసాధ్యమైన రోడ్లుగా ప్రకటించారు. మరోవైపు.. విమానాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ‘ఫ్లైట్అవేర్’ ప్రకారం అమెరికాలో గురువారం దాదాపు 22 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 5,500 విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా షికాగో నగరంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్