USA: మంచు తుపాను గుప్పిట అమెరికా.. క్రిస్మస్ వేళ వేలాది విమానాలు రద్దు!
మంచు తుపాను ధాటికి అమెరికాలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల తక్కువకు పడిపోయాయి. క్రిస్మస్ సంబరాల వేళ ఈ వాతావరణం పౌరులకు ఇబ్బందికరంగా మారింది.
వాషింగ్టన్: శీతాకాలపు మంచు తుపానుతో అమెరికా(America) గజగజ వణికిపోతోంది! భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయాయి. క్రిస్మస్(Christmas) సమీపిస్తోన్న వేళ పండగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులనూ మూసివేశారు. మధ్య అమెరికాలో లక్షలాది పౌరులకు హిమ తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మిన్నియాపొలిస్, సెయింట్ పాల్, న్యూయార్క్, షికాగో తదితర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
మోంటాన, మిన్నెసోటల్లో.. బయటి వాతావరణం చాలా చల్లగా ఉందని, జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం అమెరికన్లకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ‘ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులా కాదు. చాలా తీవ్రమైన పరిస్థితి’ అని విలేకరులతో అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ‘బాంబు సైక్లోన్’గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్(AccuWeather) సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్.. ఇతర ప్రాంతాల గవర్నర్లతో కలిసి స్థానికంగా ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.
దట్టమైన పొగ మంచుతోపాటు వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నందున.. ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రహదారి ‘ఇంటర్స్టేట్-90’ని సౌత్ డకోటాలో మూసివేశారు. ఇలా అనేక ఫ్రీవేలను ప్రస్తుతం ప్రయాణించేందుకు అసాధ్యమైన రోడ్లుగా ప్రకటించారు. మరోవైపు.. విమానాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ‘ఫ్లైట్అవేర్’ ప్రకారం అమెరికాలో గురువారం దాదాపు 22 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 5,500 విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా షికాగో నగరంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM