Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది.
వాషింగ్టన్: తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. ఆయన ఓ బిల్లుపై సంతకం చేయడానికి వచ్చిన సమయంలో వెలుగులోకి వచ్చిన దృశ్యాలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
డెమొక్రాట్లకు కీలకంగా మారిన మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ద్రవ్యోల్బణ కట్టడికి సంబంధించిన బిల్లుపై సంతకం చేసేందుకు మంగళవారం జో బైడెన్ అధికారిక యంత్రాంగం ఉన్న ఒక గదిలోకి ప్రవేశించారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో హాజరైన ఆయన మాస్క్ ధరించారు. అయితే సంతకానికి ముందు మాస్క్ తీశారు. కానీ గొంతులో ఇబ్బందిగా అనిపించడంతో చేతిలోనే దగ్గేశారు. తర్వాత బిల్లుపై సంతకం చేసి, పెన్నును వర్జీనియా సెనెటర్ జో మాంచిన్కు ఇచ్చారు. ఇంక ఆ గదిలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. గ్రెగ్ ప్రైస్ అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. దీనిపై నెటిజన్లు విస్మయం చెందారు. కొందరు కరోనా నిబంధనల గురించి ప్రశ్నించగా.. మరికొందరు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా