Mummified Body: తల్లి మృతదేహాన్ని భద్రపరచి.. 13ఏళ్లుగా సోఫాలోనే ఉంచి..!
పోలండ్లో (Poland) దారుణం వెలుగు చూసింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి 13 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది.
వార్సా: పోలండ్లో (Poland) విస్తుపోయే విషయం వెలుగు చూసింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది. అయితే, మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి (Mummified Corpse) ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13ఏళ్లుగా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని నివసిస్తున్న ఘటన అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది.
పోలండ్ రాడ్లిన్లోని రోగోజినా వీధిలో మరియన్ ఎల్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడి ఇంటికి ఇటీవల (ఫిబ్రవరి 22న) ఆయన బంధువు ఒకరు వచ్చారు. ఆ సమయంలో మరియన్ విచిత్ర చూపులు చూస్తు ఇంటిబయట తిరుగుతున్నట్లు గమనించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే ఇంట్లోకి వెళ్లి గాలించాడు. అక్కడున్న ఓ సోఫా మీద వార్తాపత్రిక కట్టలపై ఓ మృతదేహాన్ని (Mummified Body) ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వార్తాపత్రికలు కూడా 2009 సంవత్సరం నుంచి ఉన్నట్లు గుర్తించారు.
ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడున్న మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. గతంలో మరణించిన అతడి తల్లి మృతదేహం అయి ఉండవచ్చని అనుమానించారు. 2010 జనవరిలో చనిపోయిన అతడి తల్లి ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం సమీపంలోనే ఉన్న శ్మశానవాటిలోని అతడి తల్లి శవపేటికను తెరచిచూడగా అది ఖాళీగా కనిపించింది. దీంతో అంత్యక్రియల అనంతరం ఆమెను పూడ్చిపెట్టిన కొన్ని గంటలకే దాన్ని తవ్వి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. రసాయనాలతో భద్రపరచడం వల్ల ఇన్నేళ్లయినా ఆ మృతదేహం ఏమాత్రం కుళ్లిపోలేదట. అయితే, మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచిన అభియోగాలపై మరియన్ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడి మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యుల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా