Pegasus: పెగాసస్తో.. ఆ దేశ ప్రధాని ఫోన్ హ్యాక్..!
పెగాసస్తో ఫోన్ల హ్యాకింగ్.. భారత్తో పాటు అనేక దేశాల్లో ఈ వ్యవహారం గతేడాది సంచలనం సృష్టించింది. మన దేశంలో రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ఈ స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు
ఇంటర్నెట్డెస్క్: పెగాసస్తో ఫోన్ల హ్యాకింగ్.. భారత్తో పాటు అనేక దేశాల్లో ఈ వ్యవహారం గతేడాది సంచలనం సృష్టించింది. మన దేశంలో రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ఈ స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ స్పైవేర్తో స్పెయిన్ ప్రధానమంత్రి ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు తాజాగా బయటపడింది.
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ మొబైల్ ఫోన్ను గతేడాది పెగాసస్ స్పైవేర్తో హ్యాక్ చేసినట్లు ఆ దేశ ప్రెసిడెన్సీ మినిస్టర్ ఫెలిక్స్ బొలాసో సోమవారం ఓ మీడియా కాన్ఫరెన్స్లో వెల్లడించారు. మే నెలలో రెండు సార్లు ఫోన్ను హ్యాక్ చేసినట్లు తెలిపారు. రక్షణ మంత్రి మార్గరిటా రోబెల్స్ ఫోన్లోనూ స్పైవేర్ను జొప్పించినట్లు చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి ఫోన్ల నుంచి కీలక వివరాలను తస్కరించారని, ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే స్పెయిన్ జాతీయ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘ఇది అక్రమమైన, చట్ట వ్యతిరేక చర్య. బయటి వ్యక్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారు’’ అని ఫెలిక్స్ అన్నారు.
ఇదిలా ఉండగా.. స్పెయిన్లో ఈ పెగాసస్ వ్యవహారం గతంలోనూ కలకలం సృష్టించింది. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో జరిగిన వేర్పాటు ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఫోన్లను 2017 - 2020 మధ్య పెగాసస్తో హ్యాక్ చేసినట్లు సైబర్ నిపుణుల బృందం తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఫెలిక్స్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే ఈ స్పైవేర్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు గతేడాది సంచలన కథనం వెలువడింది. భారత్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఇది కాస్తా దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ స్పైవేర్ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్