Ukraine-Russia: ఉక్రెయిన్కు బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది....
దిల్లీ: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఎయిరిండియా ప్రత్యేక విమానాన్ని ఉక్రెయిన్కు పంపింది. ఈ రోజు ఉదయం దిల్లీ నుంచి డ్రీమ్లైనర్ బీ-787 బయలుదేరింది. 200 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ఈ ప్రత్యేక ఆపరేషన్కు వినియోగించనున్నారు. ఈరోజు రాత్రి ఇది తిరిగి దిల్లీకి చేరుకుంటుంది.
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు ముదురుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నేపథ్యంలోఉక్రెయిన్ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసింది. ఈ నెలలో మూడు ప్రత్యేక వందే భారత్ విమానాలను ఉక్రెయిన్-భారత్ మధ్య నడపనున్నట్లు ఫిబ్రవరి 18న ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 22, 24, 26న ఇవి ఇరు దేశాల మధ్య నడవనున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.
సరిహద్దుల్లో భారీ ఎత్తున సైన్యాన్ని, ఆయుధాలను మోహరించిన రష్యా.. ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర్య ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ‘రిపబ్లిక్ పీపుల్ ఆఫ్ ది స్టేట్స్’గా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని ప్రకటించింది. దీన్ని ఉక్రెయిన్, అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్యా గుర్తించిన ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. ఐరోపా సమాఖ్య సైతం రష్యాపై ఆంక్షలకు వెనుకాడబోమని హెచ్చరించింది. మరోవైపు తాము శాంతినే కాంక్షిస్తున్నామని.. కానీ, తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట