Antony Blinken: బాధ్యతారాహిత్య పనులు పునరావృతం కావొద్దు.. చైనాకు హెచ్చరిక!
తమ గగనతలంపై నిఘా బెలూన్ పంపడం వంటి బాధ్యతారాహిత్య పనులు మరోసారి చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనాను హెచ్చరించారు. చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో ఆయన తాజాగా సమావేశమయ్యారు.
వాషింగ్టన్: అమెరికా(America) గగనతలంలో చైనా(China) నిఘా బెలూన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలను పునరావృతం చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) తాజాగా చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీ(Wang Yi)కి స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలను అమెరికా సహించదని హెచ్చరించారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(Munich Security Conference) సందర్భంగా ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. నిఘా బెలూన్(Spy Balloon) వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగిన వేళ.. అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
‘అమెరికా ప్రాదేశిక గగనతలంలో నిఘా బెలూన్ ద్వారా.. దేశ సార్వభౌమాధికారానికి వాటిల్లిన ముప్పు, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా చైనా ఉల్లంఘనల గురించి బ్లింకెన్ నేరుగా మాట్లాడారు. ఈ బాధ్యతారాహిత్య చర్య మరోసారి జరగకూడదని వాంగ్ యీకి స్పష్టం చేశారు’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్(Ned Price) చెప్పారు. దీంతోపాటు ఉక్రెయిన్పై రష్యా(Russia) సైనిక చర్య నేపథ్యంలో.. మాస్కోకు సహకారం, ఆంక్షల ఎగవేతలో తోడ్పాటు అందించినట్లయితే ఎదురయ్యే చిక్కులు, పరిణామాల గురించి వాంగ్ యీని హెచ్చరించినట్లు ప్రైస్ చెప్పారు. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయన్నారు.
మరోవైపు వాంగ్ యీ మాట్లాడుతూ.. బెలూన్ వ్యవహారంలో వాషింగ్టన్ స్పందించిన తీరుతో తమ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. స్థానిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా ఇటువంటి పనులు చేయొద్దని పేర్కొన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన చైనా బెలూన్ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ బెలూన్ ఘటనే బ్లింకెన్ చైనా పర్యటన రద్దుకూ కారణమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు