Srilanka Crisis: పెల్లుబికిన ప్రజాగ్రహం.. శ్రీలంకలో ఎమర్జెన్సీ
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు.
కొలంబో: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వేల సంఖ్యలో నిరసనకారులు కొలంబో వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రధాని రణిల్ విక్రమసింఘే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో.. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు నీటిఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపుతప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(emergency)ప్రకటించింది. రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం కల్లా రణిల్ దిగిపోవాలి..
గొటబాయ ఈ రోజు రాజీనామా చేయాల్సి ఉండగా.. ఈ తెల్లవారుజామున దేశం దాటి మాల్దీవులకు పారిపోయారు. దాంతో శనివారం తర్వాత నిరసనకారులు మరోసారి తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. పార్లమెంట్, ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని కార్యాలయం ముందు భారీఎత్తున్న నిరసనకారులున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు ఆయన నివాస భవనం గోడలు ఎక్కుతున్నట్లు వాటిలో కనిపిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా కొనసాగడాన్ని వారు అంగీకరించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదవిని వీడకపోతే.. తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క కొందరు సైనికులు వారికి సహకరించారు. వారికి నీళ్లు అందించి దాహార్తి తీర్చారు.
మాల్దీవుల్ని వీడనున్న గొటబాయ..
స్వదేశంలో వ్యతిరేకతను దాటుకొని మాల్దీవులకు పలాయనం చిత్తగించారు గొటబాయ రాజపక్స. అయితే ఈ రోజు ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోనున్నారని సమాచారం. ఆ తర్వాత రాజీనామా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మాల్దీవుల ప్రజలు శ్రీలంక వాసులకు తమ మద్దతును ప్రకటించారు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్..
ఒకవైపు రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తుంటే.. ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహింద అభయవర్ధన నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయన దేశంలో లేకపోవడంతో ప్రస్తుత నియామకం చోటుచేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.