Monkeys: శ్రీలంక టు చైనా.. లక్ష ’కోతుల’ ఎగుమతి..!
తమ ‘జూ’ల్లో ప్రదర్శించేందుకుగానూ లక్ష కోతులు ఎగుమతి చేయాలంటూ శ్రీలంకకు చైనా విజ్ఞప్తి చేసింది. ఈ దిశగా శ్రీలంక అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
కొలంబో: ఆర్థిక సంక్షోభం (Economic Crisis)తో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక (Sri Lanka).. తన అతిపెద్ద రుణదాతల్లో ఒకటైన చైనా (China) చేసిన ఓ అభ్యర్థనను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటోంది! అదేంటంటే.. ‘కోతుల ఎగుమతి’. చైనా విజ్ఞప్తి మేరకు తమ దేశం నుంచి లక్ష కోతుల (Monkeys)ను ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా వెల్లడించింది. ‘టోక్ మకాక్ (Toque Macaques)’ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ అక్కడి అధికారులకు సూచించినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.
‘టోక్ మకాక్’ అనే కోతులు శ్రీలంకలోనే కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రకారం.. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. వెయ్యికిపైగా ‘జూ’ల్లో ప్రదర్శన కోసం ఈ కోతులను తమ దేశానికి తీసుకురావాలని చైనా భావిస్తున్నట్లు శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. శ్రీలంకలో వాటి సంఖ్య అధికంగా ఉన్నందున.. డ్రాగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఆయన తెలిపినట్లు సమాచారం. మొదటి దశ కింద కోతులను చైనాకు తరలించడంపై మంత్రి ఇటీవల ప్రత్యేక చర్చలు సైతం జరిపారు. అయితే, వాటిని ఉచితంగా పంపిస్తారా? లేక కొనుగోలు ఒప్పందం చేసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదు.
శ్రీలంకలో టోక్ మకాక్ కోతుల సంఖ్య ప్రస్తుతం 30 లక్షలు దాటినట్లు అంచనా. దీంతో స్థానిక పంటలకు ఇవి పెనుముప్పుగా మారాయని అధికారులు చెబుతున్నారు. వాటి సంఖ్యను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న తరుణంలో.. చైనా నుంచి ఈ మేరకు అభ్యర్థన వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీలంకలో విదేశీ మారక నిల్వల కొరతతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. రాజకీయ, మానవతా సంక్షోభానికి దారితీసింది. వీటినుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్న శ్రీలంక.. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్