Sri Lanka Crisis: వీధులన్నీ జనమయం.. అడుగులన్నీ అధ్యక్ష భవనంవైపే! (IN PICS)
ఆర్థిక సంక్షోభాన్ని(Economic Crisis) నిరసిస్తూ.. శ్రీలంక(Sri lanka) పౌరులు శనివారం చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. స్థానికంగా కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన దరిమిలా వేలాది ఆందోళనకారులు రాజధాని కొలంబో(Colombo) వీధుల్లోకి వచ్చారు...
కొలంబో: ఆర్థిక సంక్షోభాన్ని(Economic Crisis) నిరసిస్తూ.. శ్రీలంక(Sri lanka) పౌరులు శనివారం చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. స్థానికంగా కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేసిన దరిమిలా వేలాది ఆందోళనకారులు రాజధాని కొలంబో(Colombo) వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ జెండాలతో ఆయన అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు.
అంతకుముందు వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కొలంబో వీధుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను అదుపు చేసేందుకు జలఫిరంగులనూ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అధ్యక్ష అధికారిక నివాసానికి దారితీసే వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు బస్సులు, రైళ్లు, ట్రక్కుల్లో కొలంబోకు చేరుకున్నారు. చాలామంది జాతీయ జెండాలను పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ సమీపంలో పడటంతో.. ఓ వ్యక్తి తన ముఖాన్ని కప్పుకుంటూ కనిపించాడు. మరోవైపు.. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు విసిరిన టియర్ గ్యాస్ షెల్ను ఓ వ్యక్తి వెనక్కి విసురుతూ కనిపించాడు.
నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శనివారం తన ఇంటి నుంచి పరారైన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల పార్లమెంటులోనూ చేదు అనుభవం ఎదురైంది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారన్న విపక్ష సభ్యుల నినాదాల నడుమ ఆయన మధ్యలోనే పార్లమెంటును వీడారు.
ఈ ద్వీప దేశం కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. ఇంధన సంక్షోభం ముదిరింది. శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో.. వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను రెండువారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!