Srilanka Crisis: పెల్లుబికిన ప్రజాగ్రహం.. శ్రీలంకలో ఎమర్జెన్సీ
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు.
కొలంబో: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వేల సంఖ్యలో నిరసనకారులు కొలంబో వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రధాని రణిల్ విక్రమసింఘే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో.. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు నీటిఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపుతప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(emergency)ప్రకటించింది. రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం కల్లా రణిల్ దిగిపోవాలి..
గొటబాయ ఈ రోజు రాజీనామా చేయాల్సి ఉండగా.. ఈ తెల్లవారుజామున దేశం దాటి మాల్దీవులకు పారిపోయారు. దాంతో శనివారం తర్వాత నిరసనకారులు మరోసారి తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. పార్లమెంట్, ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని కార్యాలయం ముందు భారీఎత్తున్న నిరసనకారులున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు ఆయన నివాస భవనం గోడలు ఎక్కుతున్నట్లు వాటిలో కనిపిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా కొనసాగడాన్ని వారు అంగీకరించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదవిని వీడకపోతే.. తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క కొందరు సైనికులు వారికి సహకరించారు. వారికి నీళ్లు అందించి దాహార్తి తీర్చారు.
మాల్దీవుల్ని వీడనున్న గొటబాయ..
స్వదేశంలో వ్యతిరేకతను దాటుకొని మాల్దీవులకు పలాయనం చిత్తగించారు గొటబాయ రాజపక్స. అయితే ఈ రోజు ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోనున్నారని సమాచారం. ఆ తర్వాత రాజీనామా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మాల్దీవుల ప్రజలు శ్రీలంక వాసులకు తమ మద్దతును ప్రకటించారు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్..
ఒకవైపు రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తుంటే.. ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహింద అభయవర్ధన నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయన దేశంలో లేకపోవడంతో ప్రస్తుత నియామకం చోటుచేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)