Prabhakaran: ప్రభాకరన్ సజీవంగానే ఉన్నారనడం ‘జోక్’: శ్రీలంక
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికున్నారనే ప్రకటనను శ్రీలంక కొట్టిపారేసింది. ఇదొక జోక్ అని శ్రీలంక రక్షణశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
కొలంబో: ఎల్టీటీఈ(LTTE) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్(Prabhakaran) బతికే ఉన్నారంటూ ఓ తమిళ జాతీయోద్యమ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ‘ప్రభాకరన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో బయటకు వస్తారు’ అని పాళ నెదుమారన్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ప్రకటనను శ్రీలంక(Sri Lanka) కొట్టిపారేసింది. శ్రీలంక రక్షణశాఖ దీన్నొక ‘జోక్’గా అభివర్ణించింది. ‘ప్రభాకరన్ 2009 మే నెలలో హతమైనట్లు నిర్ధారితమైంది. డీఎన్ఏ పరీక్ష(DNA Test)తోనూ అతని మరణాన్ని ధ్రువీకరించాం’ అని శ్రీలంక రక్షణశాఖ ప్రతినిధి కర్నల్ నలిన్ హెరాత్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభాకరన్ 1970ల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE) సంస్థను ఏర్పాటు చేశాడు. ఆయన నాయకత్వంలో ఎల్టీటీఈ.. గెరిల్లా దళంగా ఎదిగింది. ఈ సంస్థ శ్రీలంకలో అనేక మంది ప్రముఖులు, పోలీసులు, మిలిటరీ దళాలపై దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఎల్టీటీఈ(LTTE)పై ఉక్కుపాదం మోపిన శ్రీలంక(Sri Lanka) ప్రభుత్వం.. సంస్థ అధినేత ప్రభాకరన్ను హతమార్చినట్లు 2009లో ప్రకటించింది. అతని మృతికి సంబంధించిన చిత్రాలు అప్పట్లో ప్రచురితమయ్యాయి. ఇది జరిగిన దాదాపు 14 ఏళ్ల తర్వాత తాజాగా ఆయన ప్రాణాలతోనే ఉన్నాంటూ ప్రకటన రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్