Sri Lanka: ఆరు నెలల్లో 5 బిలియన్ డాలర్లు అవసరం: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ప్రధాని రణిల్ విక్రమసింఘే మంగళవారం...
కొలంబో: ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే మంగళవారం పార్లమెంట్కు తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం మాత్రమే సరిపోదని.. మొత్తం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖనూ నిర్వహిస్తున్న ఆయన.. ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ‘మధ్యంతర బడ్జెట్’పై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు.. ఎరువుల కొనుగోలు కోసం భారత్కు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 55 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ను శ్రీలంక కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత ప్రతినిధి మంగళవారం తెలిపారు.
2.2 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీప దేశం ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వల పడిపోయాయి. ఆహారం, ఇంధనం, మందులు తదితరాల కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు. గొటబాయ రాజపక్స, ఆయన కుటుంబ సభ్యుల ప్రభుత్వ వ్యతిరేక విధానాల కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందంటూ పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గొటబాయ సోదరుడు మహింద రాజపక్స ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు రణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభ శ్రీలంకను గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.