srilanka crisis: ద్వీప దేశం నుంచి ప్రాణాలను పణంగా పెట్టి వలసలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరళ్లల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు వస్తోన్నట్లు సమాచారం.
కొలంబో: తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు వస్తోన్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు దక్షిణ భారత దేశంలో కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ రుణాలు, కరోనా వైరస్ వ్యాప్తి, కరెన్సీ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల కొనుగోలు కష్టతరం కావడంతో ఆకలితో అలమటిస్తూ అక్కడి ప్రజలు వలసల బాట పడుతున్నారు. కిలో బియ్యం రూ.500, కిలో పంచదార రూ. 290 ఉంది. ఆకాశానంటుతున్న ధరలతో కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలను నిరాశతో వీధిన పడేలా చేసింది. గత నెలలో శ్రీలంక నుంచి వలస వచ్చిన కొంతమంది ప్రజలు తమిళనాడులోకి ప్రవేశిస్తూ రామేశ్వరం తీరం దగ్గర పోలీసులకు చిక్కారు. దర్యాప్తులో వారు శ్రీలంకకు చెందిన వారమని, ప్లాస్టిక్ బోటుకు రూ.50 వేలు చెల్లించి అతికష్టం మీద భారత్కు చేరుకున్నామని చెబుతున్నారు. వారిపై విదేశీ చట్టం, పాస్పోర్టుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఆవాసాలు కల్పించడానికి యత్నాలు:
శరణార్థులకు ఆవాసాలు కల్పించడానికి తీర ప్రాంత రక్షక దళం కసరత్తులు చేస్తోంది. ఖాళీ స్థలాలను వెతుకుతోంది. రోజువారి వేతన కార్మికులుగా పనిచేసే వారికి ఉపాధి కల్పించి రక్షణ దళం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)