Sri Lanka crisis: కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు!
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ అక్కడి వైద్యులు చేదు నిజాన్ని వెల్లడించారు. ప్రాణాలు కాపాడే ఔషధాల కొరత ఇలాగే ఏర్పడితే......
అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదిరిపోతోంది. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిపోయాయి. వీటికి తోడు ఔషధాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి వైద్యులు చేదు నిజాన్ని వెల్లడించారు. ప్రాణాలు కాపాడే ఔషధాల కొరత ఇలాగే ఏర్పడితే.. కరోనా కారణంగా ఈ రెండేళ్ల కాలంలో సంభవించిన మరణాల కంటే ఈ సంక్షోభ మరణాల అధికంగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆసుపత్రుల్లో పలు రకాల వైద్య పరికరాలు అందుబాటులో లేక గత నెల రోజులుగా సాధారణ శస్త్రచికిత్సలు నిలిచిపోయినట్లు శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (ఎస్ఎల్ఎంఏ) వెల్లడించింది. అత్యవసర శస్త్రచికిత్సలు కూడా త్వరలోనే ఆగిపోయే ప్రమాదం పొంచిఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు లేఖ రాసినట్లు ఎస్ఎల్ఎంఏ పేర్కొంది.‘కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఎవరికి చికిత్స అందించాలో, సౌకర్యాల కొరత కారణంగా ఎవరికి ట్రీట్మెంట్ అందించలేమో తేల్చుకోలేకపోతున్నాం. పరిస్థితులు ఇలాగే ఉంటే కరోనా మరణాల కంటే ఈ సంక్షోభ మరణాలే ఎక్కువగా ఉంటాయి’ అని లేఖలో పేర్కొంది.
తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభమూ ముదురుతోంది. అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. శనివారం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న మధ్యాహ్నం అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ముందుకు చేరుకున్న దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఆదివారం తెల్లవారుజాము వరకు అక్కడే నిరసన చేపట్టడం గమనార్హం. రాత్రంతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి కదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.