Lotus tower: కొలంబో ‘లోటస్ టవర్’ ప్రారంభానికి సర్వం సిద్ధం.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
ద్వీప దేశమైన శ్రీలంక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘లోటస్ టవర్’ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది......
ఇంటర్నెట్ డెస్క్: ద్వీప దేశమైన శ్రీలంక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘లోటస్ టవర్’ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. చైనా రుణంతో నిధులు సమకూర్చుకొని దాదాపు పదేళ్ల పాటు నిర్మించిన ఈ ‘కొలంబో లోటస్ టవర్’ ఈ వారంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1150 అడుగులు (350 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ భారీ టవర్ అబ్జర్వేషన్ డెక్ గురువారం నుంచి సందర్శకులకు తెరిచే ఉంటుందని ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొలంబో లోటస్ టవర్ యాజమాన్యం సంస్థ వెల్లడించింది. ఈ భవనంలోని ఆఫీస్, షాపింగ్ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఈ టవర్ నుంచి రద్దీగా ఉండే రాజధాని కొలంబో నగరంతో పాటు హిందూ మహా సముద్రాన్ని వీక్షించవచ్చు. అయితే, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు ఈ టవర్ ఓ ‘తెల్ల ఏనుగు’గా మారనుందనే విమర్శలూ వినబడుతున్నాయ.
ఈ టవర్ ప్రత్యేకతలివే..
- తామర పువ్వు నమూనాలో ఈ భవనాన్ని డిజైన్ చేశారు.
- ఆసియాలో ఉన్న ఎత్తయిన టవర్లలో 11వది కాగా.. ప్రపంచంలో 19వ ఎత్తయిన టవర్.
- తొలుత దీన్ని పెలియగోడ సబర్బన్లో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఆ లొకేషన్ను మార్పు చేసింది. ఈ టవర్ను కమ్యూనికేషన్, అబ్జర్వేషన్, ఇతర అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
- ఈ టవర్ నిర్మాణానికి అంచనా వ్యయం 113 మిలియన్ అమెరికా డాలర్లు. 2012లో (మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్స హయాంలో) టవర్ నిర్మాణం మొదలుపెట్టారు. అప్పట్నుంచి అవినీతి ఆరోపణలు రావడంతో ఆటంకాలు ఏర్పడి ఎట్టకేలకు పూర్తయింది.
- ఈ టవర్కు పర్యాటకం, యాంటెన్నా లీజింగ్ ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఈ లోటస్ టవర్ రేడియో, టీవీ ప్రసార యాంటెన్నా ISDB-T, 50 టీవీ సర్వీసుల కోసం ప్రతిపాదించిన DVB-T2 సపోర్ట్ స్ట్రక్చర్గా పని చేస్తుంది. అలాగే, 35 ఎంఫ్ఎం రేడియో స్టేషన్లు, 20 టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సేవలందిస్తుంది.
- లోటస్ టవర్కు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో రెండు వీఐపీ ఎంట్రన్స్లు. లోటస్ టవర్ పొడియం ఆరు అంతస్తుల్లో ఉండగా.. ల్యాండ్ స్కేపింగ్ని పెద్ద వాటర్ పార్క్గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా