Sri Lanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాలకు రూ.2.2కోట్ల జరిమానా
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అక్కడి సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఉగ్రదాడులను నిర్మూలించడంలో విఫలమైనందుకు మాజీ అధ్యక్షుడితోపాటు మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు 31కోట్ల రూపాయల (శ్రీలంక కరెన్సీ) జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అక్కడి సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఉగ్రదాడులను నిర్మూలించడంలో విఫలమైనందుకు మాజీ అధ్యక్షుడితోపాటు మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు 31కోట్ల రూపాయల (శ్రీలంక కరెన్సీ) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. వీటిని ఆనాటి ఘటనలో బాధితులకు నష్టపరిహారంగా అందజేయాలంటూ తీర్పునిచ్చింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో 2019 ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 270మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 500 మంది క్షతగాత్రులైనట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, ప్రార్థన మందిరాలు, హోటళ్లలో జరిగిన ఆ మారణహోమానికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వానికి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ వాటిని నిర్మూలించడంలో మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత కుటుంబాలు శ్రీలంక సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం.. అప్పటి దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతోపాటు మరో నలుగురు ఉన్నతాధికారులకు భారీ జరిమానా విధించింది.
నాటి శ్రీలంక అధ్యక్షుడు, రక్షణశాఖ మంత్రి, త్రివిధ దళాధిపతిగా ఉన్న మైత్రిపాల సిరిసేనకు అత్యధికంగా రూ.2.2కోట్ల (2లక్షల 73వేల డాలర్లు) జరిమానా విధించింది. వీటిని తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాలని ఆదేశించింది. ఇక మాజీ పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర, మాజీ స్టేట్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ అధినేత నీలాంత జయవర్దనేకు 2లక్షల డాలర్ల చొప్పున చెల్లించాలని తెలిపింది. రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో లక్షా 36వేల డాలర్లు, మాజీ నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ చీఫ్ సిరిరా మెండిస్కు 27వేల డాలర్ల జరిమానా విధించింది. వీరి వైఫల్యం కారణంగానే దారుణమైన మానవబాంబు ఘటన చోటుచేసుకుందని శ్రీలంక సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!