Earthquake: తైవాన్లో భారీ భూకంపం.. సమీప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు!
తైవాన్(Taiwan) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. ఇక్కడి చిషాంగ్ పట్టణంలో ఏడు కిలోమీటర్ల లోతులో...
ఇంటర్నెట్ డెస్క్: తైవాన్(Taiwan) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. ఇక్కడి చిషాంగ్ పట్టణంలో ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. శనివారం సైతం అదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పటినుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం భారీ తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, క్షతగాత్రుల సంఖ్య తెలియరాలేదు. రాజధాని తైపీ(Taipi)లోనూ ప్రకంపనలు కనిపించాయి. తమ తీర ప్రాంతాల్లోని ఫుజియాన్, గ్వాంగ్డాంగ్, జియాంగ్సు, షాంఘైలోనూ ప్రకంపనలు నమోదయ్యాయని చైనా(China) తెలిపింది.
భూకంపం ధాటికి తైవాన్లో అనేక భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కట్టడాలు ఊగిపోయాయి. యూలి పట్టణంలో మూడంతస్తుల భవనం కూలిపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. ఈ పట్టణంలో ఏడువేలకు పైగా ఇళ్లలో విద్యుత్, నీటి కనెక్షన్లు దెబ్బతిన్నాయి. ఓ వంతెన కూలిపోయింది. ఆరెంజ్ డే లిల్లీస్కు ప్రసిద్ధి చెందిన ఓ పర్వతంపై కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఫులి పట్టణంలోని డోంగ్లీ స్టేషన్లో ఓ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ స్టేషన్లో ఆగి ఉన్న రైలు అటు ఇటు ఊగిపోతున్నట్లు కనిపిస్తోన్న వీడియో.. నెట్టింట వైరల్గా మారింది.
తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్వెన్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విపత్తుపై మాట్లాడారు. మరిన్ని ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని పౌరులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు.. భారీ భూకంపం కారణంగా జపాన్ వాతావరణ సంస్థ సైతం తైవాన్ సమీపంలోని దక్షిణ జపనీస్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?