North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా
దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోని ఇమ్జిన్ నదిపై ఉన్న డ్యామ్ నుంచి ఉత్తర కొరియా హఠాత్తుగా నీటిని విడుదల చేసింది. ఈ ఘటనతో ఒక్కసారి నీటి మట్టాలు పెరగడంతో ఆ నదీ పరీవాహక
ఇంటర్నెట్డెస్క్: దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోని ఇమ్జిన్ నదిపై ఉన్న డ్యామ్ నుంచి ఉత్తర కొరియా హఠాత్తుగా నీటిని విడుదల చేసింది. ఈ ఘటనతో ఒక్కసారి నీటి మట్టాలు పెరగడంతో ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించింది. సోమవారం ఈ నదిపై యెన్చెన్ కౌంటీ వద్ద ఉన్న వంతెన సమీపంలో మీటర్ మేరకు నీటి మట్టం పెరగడంతో వెంటనే పర్యాటకులను, నది ఒడ్డున ఉన్నవారిని ఖాళీ చేయించారు. దీనిపై సియోల్కు చెందిన ఇంటర్ కొరియన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘హ్వంగాంగ్ డ్యామ్ నుంచి ఉత్తరకొరియా నీటిని విడుదల చేసినట్లుంది’’ అని వ్యాఖ్యానించారు.
ద.కొరియా ప్రభుత్వం ఎంత మందిని ఖాళీ చేయించిందనే విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం నీటి మట్టం 5.2 అడుగులు తగ్గుముఖం పట్టిందని యెన్చెన్ కౌంటీ అధికారులు తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియాలో భారీ వర్షాలు పడటంతో ఎటువంటి సమాచారం లేకుండానే నీటిని దిగువకు విడుదల చేసింది. నీటిని విడుదలకు ముందు నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే దక్షిణ కొరియా అధికారులు పలు మార్లు ఉత్తరకొరియా అధికారులను కోరారు. కానీ, ప్యాంగ్యాంగ్ నుంచి ఎటువంటి స్పందనా లేదు.
2019లో ఉత్తరకొరియా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కిందికి నీటిని విడుదల చేసింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు దక్షిణ కొరియా వాసులు చనిపోయారు. ఆ తర్వాత ఈ అంశంపై ఇరుదేశాలు చర్చించుకొన్నాయి. అప్పట్లో మృతులకు ఎట్టకేలకు ప్యాంగ్యాంగ్ దౌత్య బృందం సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.