Sydney: సిడ్నీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం
ఆస్ట్రేలియాలో కీలక నగరమైన సిడ్నీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 2022 ముగియటానికి మరో 86 రోజులు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో వర్షం కురియడం వాతవరణ మార్పులకు అద్దంపడుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాలో కీలక నగరమైన సిడ్నీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 2022 ముగియటానికి మరో 86 రోజులు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో వర్షం కురియడం వాతవరణ మార్పులకు అద్దంపడుతోంది. ఈ నగరంలో జనవరి నుంచి మొత్తం 2,200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 1950లో నమోదైన 2,194 మిల్లీ మీటర్ల కంటే ఇది ఎక్కువ. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ధ్రువీకరించింది. ఇప్పటికే ఆ దేశంలో లానిన ప్రభావంతో భారీగా వర్షాలు కురిసి వరదలు పోటెత్తాయి.
ఈ ఏడాది వేసవిలో కూడా వర్షపాతం తగ్గకపోవచ్చని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారు అంచనావేస్తున్నారు. ‘‘ఈ రోజున సిడ్నీ చుట్టుపక్కల భారీ వర్షపాతం నమోదవుతోంది. ఇది భవిష్యత్లో మరింత దారుణంగా మారనుంది’’ అని న్యూసౌత్ వేల్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మినిస్టర్ స్టెప్ కుక్ గురువారం పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది మరిన్ని తుపాన్లు, వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే డ్యామ్లు, నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో భవిష్యత్లో వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్లోని హాక్స్బరీ-నెపియన్ వరద ముప్పు తీవ్రంగా ఉంది. ఇక్కడ రెండేళ్లలో నాలుగు సార్లు వరదలు వచ్చాయి.
సాక్విల్లె బాత్టబ్లో నివాసం..!
ఆస్ట్రేలియాలోనే అత్యధిక వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతం న్యూసౌత్వేల్స్. ఇక్కడ ప్రవహించే హాక్స్బరి-నెపియన్ నది వరద అంతవేగంగా బయటకు వెళ్లకుండా భౌగోళిక పరిస్థితులు నెలకొన్నాయి. విండ్సోర్, రిచ్మాండ్, ఈమూ ప్లెయిన్స్, పాన్రిత్, బ్లాక్ టౌన్ వంటి ప్రాంతాలు ఈ నది వరదకు అనుకూలంగా ఉంటాయి. వీటిల్లో చాలా వరకు ద్వీపాల వలే నీరు చుట్టుముట్టి ఉంటాయి. ఇక్కడే ‘సాక్విల్లె బాత్టబ్’ అనే లోతట్టు ప్రాంతంలో దాదాపు 18 వేల మంది నివసిస్తున్నారు. రిచ్మాండ్ నుంచి సాక్విల్లె మధ్య ఉన్న ప్రదేశం ఇది. వరదల సమయంలో ఈ ప్రదేశం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీనిలో పశ్చిమ సిడ్నీకి చెందిన కుంబర్లాండ్ ప్లెయిన్లు కూడా భాగమే. దాదాపు 100 మిలియన్ల సంవత్సరాలపాటు జరిగిన భౌగోళిక మార్పులో భాగంగా ఏర్పడ్డ తొట్టె వంటి ఈ ప్రదేశం చుట్టూ నిట్టనిలువు భూభాగాలు ఉంటాయి. ఇక్కడి నుంచి హాక్స్బరి-నెపియన్ నది ఇరుకైన భారీ ఇసుక శిలల మధ్య నుంచి కిందకు ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం కారణంగా సాక్విల్లె బాత్టబ్ నుంచి వేగంగా వరద బయటకు పోలేదు. సాక్విల్లె బాత్టబ్కు దాదాపు ఐదు ప్రవాహాల నుంచి నీరు చేరుతుంది. అదే సమయంలో బయటకు వెళ్లే మార్గాలు ఇరుకైపోయాయి. మరోవైపు సిడ్నీ వేగంగా విస్తరిస్తుండటంతో ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చోటు చేసుకొంటున్నాయి.
హాక్స్బరి-నెపియన్ నదీ పరీవాహక ప్రాంతంలో సుదీర్ఘకాలం పొడి వాతారణం- తేమ వాతవరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన రాబిన్ వార్నర్.. దాదాపు 100 ఏళ్ల వాతావరణ చక్రాన్ని దీనికి ఆధారంగా చూపారు. ఇక్కడ దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు పొడి వాతావరణం ఉన్న తర్వాత చిన్న వరదలు మొదలై.. తేమ వాతావరణం, భారీ వరదలు చోటుచేసుకుంటాయి. ఆ పరిస్థితి మరో 50 ఏళ్ల వరకు ఉంటుంది. 1950 నుంచి 1990 వరకు ఉన్న తేమ వాతావరణంలో ప్రతి నాలుగేళ్లకు ఒక సారి చొప్పున 12 మార్లు అత్యంత భారీ వరదలను న్యూసౌత్వేల్స్ చవిచూసింది. ఆ తర్వాత 1990 నుంచి గతేడాది వరకు భారీ వరదలు మళ్లీ రాలేదు. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలల నుంచి వరదలు వస్తున్నాయి. దీన్ని చూసిన సిడ్నీ విశ్వవిద్యాలయం.. మరో 20 ఏళ్లపాటు వరదల ముప్పు పొంచి ఉంటుందని గతేడాది అంచనా వేసింది. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడిగాలులు వాతావరణంలో తేమను పెంచుతాయి. ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు నమోదవుతాయని చాలా వాతావరణ పరిశోధనలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్