Syria: భూకంపంలో ధ్వంసమైన జైలు.. ఐఎస్ ఉగ్రవాదులు పరార్..!
భూకంపంతో ధ్వంసమైన ఓ జైలు (Prison) నుంచి ఖైదీలు పారిపోయిన ఘటన సిరియా (Syria)లో చోటుచేసుకుంది. అయితే, పారిపోయిన వారంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని (IS terrorists) అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాను (Syria) తాజా భూకంపం (Earthquake) మరింత వణికిస్తోంది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోగా.. కూలిపోయిన భవనాల కింద వేల మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో భూకంపం కారణంగా అక్కడ ఓ జైలు ధ్వంసమైంది. ఇదే అదనుగా భావించిన కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (IS terrorists).. అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నైరుతీ సిరియాలోని రాజో ప్రాంతంలో మిలటరీ పోలీస్ జైలు ఉంది. అక్కడ సుమారు 2వేల మంది ఖైదీలు ఉన్నారు. అందులో సుమారు 1300 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారే. అయితే, సోమవారం సంభవించిన భూకంపంలో ఆ జైలు ధ్వంసమైంది. అదే సమయంలో కొందరు ఖైదీలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుమారు 20 మంది పారిపోయారని.. వారంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. జిహాదీలను విడిపించుకునేందుకు గాను అక్కడి రాఖా జైలుపై కొన్ని వారాల క్రితమే దాడి జరిగింది. ఈ ఘటన జరిగి కొన్ని వారాల వ్యవధిలోనే భూకంపం రావడంతో అక్కడి నుంచి ఐఎస్ ఉగ్రవాదులు పారిపోవడం గమనార్హం.
మరోవైపు సిరియాలో భూకంప ప్రభావానికి వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 1600 మంది చనిపోయినట్లు పేర్కొన్నప్పటికీ మృతుల సంఖ్య భారీగా ఉండనుందని అంచనా. తుర్కియే, సిరియాలో కలిపి ఇప్పటికే 5వేలకుపైగా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, శిథిలాల కింద వేల మంది చిక్కుకొని ఉండవచ్చని.. వాస్తవంగా ఈ సంఖ్య 20వేలకుపైనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?