Taiwan: పొద్దుపొద్దున్నే ఉలిక్కిపడిన తైవాన్ ప్రజలు .. అసలు ఏమైందంటే..?
బుధవారం ఉదయం తైవాన్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ దేశ టీవీలో కనిపించిన వార్త వారిని తీవ్ర కలవరానికి గురించి చేసింది. తర్వాత ఆ వార్తా సంస్థ వివరణ ఇవ్వడంతో వారు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
తైపీ: తైవాన్ ప్రజలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ దేశ టీవీలో కనిపించిన వార్తే దీనికి కారణం. తర్వాత ఆ వార్తా సంస్థ వివరణ ఇవ్వడంతో వారు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..
తైవాన్ ప్రభుత్వ టీవీ బుధవారం ఉదయం లైవ్ న్యూస్ ప్రసారం చేస్తోన్న సమయంలో చైనా దాడి చేసినట్లు వెల్లడించింది. రాజధాని తైపీకి సమీపంలోని సైనిక నౌకలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై చైనా క్షిపణులు దాడి జరిపినట్లు టీవీ స్క్రీన్ కింద టిక్కర్ రూపంలో ప్రసారం చేసింది. యుద్ధం రావొచ్చని, తైపీకి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్కు చైనా ఏజెంట్లు నిప్పు పెట్టారని, తైవాన్ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ ఆ హెచ్చరికల్లో పేర్కొంది. దీంతో అక్కడి ప్రజలు వణికిపోయారు.
ఆ తర్వాత వెంటనే సదరు వార్తా సంస్థ తాను చేసిన ఘోర తప్పిదాన్ని గుర్తించింది. అలాంటిదేమీ లేదు.. భయపడొద్దంటూ ప్రజలకు సర్దిచెప్పింది. ‘దేశ ప్రజలారా భయపడకండి. మంగళవారం అగ్నిమాపక శాఖతో చేసిన డ్రిల్ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశాం. సాంకేతికలోపం కారణంగా అవి ఉదయం టీవీలో ప్రసారమయ్యాయి’ అంటూ తర్వాతి బులెటిన్లో న్యూస్ యాంకర్ వివరణ ఇచ్చారు. అలాగే దేశప్రజల నుంచి క్షమాపణలు కోరారు. మొదట కంగారు పడిన ప్రజలు.. ఈ వివరణతో శాంతించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి అందరి చూపు చైనా పక్కన ఉన్న తైవాన్ మీదే పడింది. డ్రాగన్ దేశంతో ముప్పుపొంచి ఉందని భావిస్తున్న ఆ దేశం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోంది. దానిలో భాగంగా యుద్ధ పరిస్థితులే వస్తే.. పౌరులు ఏవిధంగా స్పందించాలనే దానిపై ఇటీవల హ్యాండ్ బుక్ రూపంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక, స్వయం పాలనలో ఉన్న తైవాన్.. తమలో భాగమేనని, దానిని కలిపేసుకుంటామని చైనా పలు సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవలి కాలంలో తైవాన్ సమీపంలో కి యుద్ధ నౌకలు, యుద్ధవిమానాలు పంపుతూ భయాందోళనలూ కలిగిస్తోంది. మరోవైపు తైవాన్ మాత్రం.. చైనా నుంచి వెంటనే దురాక్రమణ ముప్పు పొంచి ఉందని ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హెచ్చరిక స్థాయిని పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ