Breast Feeding: పాలిచ్చే తల్లుల ఫొటోలు తీస్తే.. జైలుకే!
ప్రతి మహిళ.. ఏదో ఒక సందర్భంలో వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉంది. వావివరుసలు, వయోభేదం లేకుండా మహిళలపై కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఆఖరికి బిడ్డకు పాలిచ్చే తల్లులను కూడా కామేచ్ఛతో చూసే మృగాలు ఈ సమాజంలో తిరుగుతున్నాయి. చంటిబిడ్డలకు తల్లిపాలే
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి మహిళ.. ఏదో ఒక సందర్భంలో వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉంది. వావివరుసలు, వయోభేదం లేకుండా మహిళలపై కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఆఖరికి బిడ్డకు పాలిచ్చే తల్లులను కూడా కామేచ్ఛతో చూసే మృగాలు ఈ సమాజంలో తిరుగుతున్నాయి. చంటిబిడ్డలకు తల్లిపాలే శ్రేయస్కరం కావడంతో ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలోనైనా బిడ్డకు చనుబాలు పట్టాల్సిందే. ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు తల్లుల్ని ఫొటోలు తీస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వేధింపులను అడ్డుకునేలా ఇంగ్లాండ్, వేల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చనుబాలు పడుతున్న తల్లుల ఫొటోలు/వీడియోలను వారి అనుమతి లేకుండా తీస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా తమ న్యాయ చట్టాల్లో సవరణ చేశాయి.
మహిళా ఎంపీనీ వదల్లేదు..
చంటిబిడ్డ తల్లులు ఇలాంటి అభ్యంతరకర ఘటనలను ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. యూకేకి చెందిన స్టెల్లా క్రీసీ, జులియా కూపర్ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్టెల్లా.. యూకే పార్లమెంట్ సభ్యురాలు. ఆమె నార్త్ లండన్లో ఓసారి రైలులో వెళ్తూ తన నాలుగు నెలల బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటో తీశాడట. జులియా.. మాంచెస్టర్లో పాపులర్ డిజైనర్. తను ఓ పార్కులో కూర్చొని చంటిపాపకు చనుబాలు పడుతుండగా ఓ ఆకతాయి అతడి కెమెరాకు జూమ్ లెన్స్ అమర్చి మరీ తన ఫొటోలు తీశాడట. ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది నేరం కిందకు రాదని కేసు నమోదు చేసుకోలేదట.
ఉద్యమానికి తలొంచిన ప్రభుత్వం
ఇలా ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ సమస్యను వీరిద్దరూ ప్రపంచం దృష్టికి తేవాలనుకున్నారు. మరికొందరితో కలిసి ‘స్టాప్ ది బ్రెస్ట్పెస్ట్స్’ పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసి.. మాతృమూర్తుల్ని సంతకాలు చేయమని కోరారు. అలా వీరి ఉద్యమం ఉద్ధృతమై.. యూకే పార్లమెంట్ దిగువ సభ వరకూ వెళ్లింది. దీంతో అనుమతి లేకుండా చనుబాలు పట్టే తల్లుల ఫొటోలు/వీడియోలు తీయడాన్ని నేరంగా పరిగణిస్తూ పోలీస్, క్రైమ్, సెంటెన్సింగ్ అండ్ కోర్ట్ బిల్లులో సవరణ చేస్తున్నట్లు న్యాయశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై లా కమిషన్ సమీక్షిస్తోంది. త్వరలోనే ఇది చట్టంగా మారి అమల్లోకి రానుంది.
‘‘ఏ ఒక్క చంటిబిడ్డ తల్లి అలాంటి వేధింపులకు గురికాకూడదు. ఇకపై ఆ చర్యలను కూడా నేరంగా పరిగణిస్తాం. ఈ క్రమంలోనే చట్ట సవరణ చేస్తున్నాం. మహిళల రక్షణ కోసం మేం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని అక్కడి న్యాయశాఖ ప్రతినిధులు వెల్లడించారు.
ఇది గొప్ప ముందడుగు: నేహా ధూపియా
యూకే తీసుకున్న ఈ నిర్ణయాన్ని బాలీవుడ్ నటి నేహా ధూపియా స్వాగతించారు. ఇన్స్టా వేదికగా ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. ఇది బిడ్డలకు తల్లులు స్వేచ్ఛగా పాలిచ్చే విధంగా తీసుకున్న గొప్ప ముందడుగు, ప్రపంచం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘స్టాప్ ది బ్రెస్ట్ పెస్ట్స్’ తరహాలోనే ‘ఫ్రీడమ్ టు ఫీడ్’ పేరుతో చాలాకాలంగా నేహా ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్వహిస్తున్నారు. పిల్లలను పెంచి పోషించే విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్