‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!
Talibans on Al-Jawahiri killing: అమెరికా డ్రోన్ దాడిలో అల్ఖైదా నేత అల్ జవహరీ మరణంపై అఫ్గాన్లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు.
కాబుల్: అమెరికా డ్రోన్ దాడిలో అల్ఖైదా నేత అల్ జవహరీ (Al-Jawahiri) మరణంపై అఫ్గాన్లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వానికి గానీ, తాలిబన్ నేతలకు గానీ అక్కడేం జరిగిందో ఏమాత్రం తెలీదని దోహాలో తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షహీన్ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. దీనిపై నాయకత్వం సైతం సమావేశమవుతోందని, వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు. ఈ ప్రకటన కంటే ముందు ఎలా స్పందించాలన్న దానిపై తాలిబన్ నాయకత్వం తీవ్ర తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది.
అల్ఖైదా అగ్రనేత అల్ జవహరీ కాబుల్లోని ఓ నివాసంలో ఉండగా.. అమెరికా అతడిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. జవహారీ మరణాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా కీలక ప్రకటన కూడా చేసింది. జవహరీ నివాసం ఉన్న ఇల్లు సైతం హక్కానీ నేత సిరాజుద్దీన్ హక్కానీకి అనుచరుడిదిగా తేలింది. జవహరీ మరణం అఫ్గానిస్థాన్ను ఏలుతున్న తాలిబన్లకు, అల్ఖైదాకు మధ్యనున్న పొత్తును ప్రపంచానికి బట్టబయలు చేసింది. అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక సాయం కోసం తాలిబన్ల ప్రయత్నాన్నీ దెబ్బతీసింది.
అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు 2020లో కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం తాలిబన్ సర్కారు తమ భూభాగంపై అల్ఖైదా సభ్యులకు ఆశ్రయమివ్వబోమని మాట ఇచ్చింది. జవహరీ కాబూల్లోనే ఒక సురక్షిత గృహంలో ఆశ్రయం పొందడాన్ని బట్టి దోహా ఒప్పందాన్ని తాలిబన్లు ఉల్లంఘించినట్లయింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఆడ పిల్లలు ఆరో తరగతికి మించి చదవకూడదని ఆంక్షలు విధిస్తున్నారని ఇప్పటికే అంతర్జాతీయంగా తాలిబన్లపై విమర్శలు వస్తున్నాయి. కొవిడ్ దెబ్బకు, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలకు కుదేలైన తాలిబన్ సర్కారు అంతర్జాతీయ ఆర్థిక సాయం కోసం చూస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే జవహరీ అక్కడ హతమవడం దొరికిపోయిన దొంగలయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జవహరీ అఫ్గాన్లోనే ఉన్నారన్న విషయమే తమకు తెలీదన్న రీతిలో తాలిబన్లు కవరింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు