Afghanistan: విడాకులను రద్దు చేసిన తాలిబన్లు.. మాజీ భర్తలతోనే ఉండాలంటూ హుకుం..!
తాలిబన్ల (Taliban) పాలనలో అఫ్గానిస్థాన్ (Afghanistan) మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భర్తల చేతిలో హింసకు గురై, విడాకులు (Divorce) తీసుకున్న మహిళలు తిరిగి వారితోనే కలిసి జీవించాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ను (Afghanistan) తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబాన్లు (Taliban) పలు అంశాల్లో ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళల చదువు, ఉద్యోగాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. విద్యాసంస్థల మూసివేత మొదలు.. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపైనా నిషేధం విధిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహిళల విడాకులను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో భర్తల చేతిలో వేధింపులకు గురై దూరంగా ఉంటున్న మహిళలను, తిరిగి వారి మాజీ భర్తల వద్దకే వెళ్లి జీవించాలని ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.
అఫ్గాన్లో అమెరికా బలగాలు ఉన్న సమయంలో అక్కడి మహిళలకు కొంత స్వేచ్ఛ లభించినట్లు కనిపించింది. కానీ, తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ చరిత్రలో కలిసిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారిపైనా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసిపోవాలంటూ తాలిబాన్ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లు అఫ్గాన్ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఐరాస కూడా ఇటీవల పేర్కొంది.
గతంలో విడాకులు తీసుకున్న మహిళలు వారి మాజీ భర్తలతోనే కలిసి ఉండేలని ఒత్తిడి తెస్తున్నారనడంపై తాలిబాన్ ప్రతినిధులు స్పందించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని.. అనంతరం షరియా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తాలిబాన్ అధికార ప్రతినిధి ఇనాయతుల్లా మీడియాకు వెల్లడించారు. గతంలో తీసుకున్న విడాకులను ఆమోదిస్తారా అన్న ప్రశ్నకు.. ఇది ముఖ్యమైన, సంక్లిష్టమైన సమస్య అని సమాధానం దాటవేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ