Mullah Omar: 2001లో పూడ్చి.. ఇప్పుడు తవ్వితీసి! ఈ ‘తాలిబన్’ కారు వెనకున్న కథ ఇదే
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ వాడిన ఓ కారును దాదాపు 21 ఏళ్ల తర్వాత తాజాగా భూమిలోంచి బయటకు తవ్వి తీశారు. 9/11 ఘటన తర్వాత అఫ్గానిస్థాన్పై అమెరికా బలగాలు జరిపిన దాడుల నుంచి తప్పించుకునేందుకుగానూ ఆయన ఇదే వాహనాన్ని...
కాబుల్: తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ వాడిన ఓ కారును దాదాపు 21 ఏళ్ల తర్వాత భూమిలో నుంచి బయటకు తవ్వి తీశారు. 9/11 ఘటన తర్వాత అఫ్గానిస్థాన్పై అమెరికా బలగాలు జరిపిన దాడుల నుంచి తప్పించుకునేందుకుగానూ ఆయన ఇదే వాహనాన్ని ఉపయోగించారు. ఈ తెల్లరంగు కారును తూర్పు అఫ్గానిస్థాన్ జాబుల్ ప్రావిన్స్లోని ఓ గ్రామ సమీపంలో వెలికితీశారు. 2001లో తాలిబాన్ నేత అబ్దుల్ జబ్బార్ ఒమారీ సమక్షంలో దీన్ని పూడ్చిపెట్టారు. తాజాగా ఆయన ఆదేశాల మేరకు దాన్ని తవ్వి తీశారు.
‘కారు ఇప్పటికీ మంచి కండిషన్లో ఉంది. దాని ముందు భాగం మాత్రమే కొంచెం దెబ్బతింది’ అని జాబుల్ ప్రావిన్స్ సమాచార, సంస్కృతిశాఖ డైరెక్టర్ రహ్మతుల్లా హమ్మద్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ వాహనాన్ని ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఉండేందుకుగానూ.. 2001లో ఒమర్కు గుర్తుగా పాతిపెట్టారని చెప్పారు. ప్రస్తుతం ఈ కారును కాబుల్లోని జాతీయ మ్యూజియంలో చారిత్రక స్మారక చిహ్నంగా ప్రదర్శించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. చేతి పారలను ఉపయోగించి తవ్వి తీసిన కారు చిత్రాలను విడుదల చేశారు.
ముల్లా ఒమర్.. అఫ్గాన్లోని కాందహార్లో తాలిబన్ను స్థాపించారు. ఏళ్లపాటు అంతర్యుద్ధం తర్వాత 1998కల్లా తాలిబన్లు దేశాన్ని చాలావరకూ తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. ఇస్లామిక్ పాలన పేరిట కఠిన నిబంధనలు అమలు చేశారు. అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదాతోసహా అనేక తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చారు. అయితే, లాడెన్ను అప్పగించేందుకు నిరాకరించడంతో.. 2001 అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. దాడుల క్రమంలోనే ముల్లా ఒమర్.. ఈ కారులోనే కాందహార్ నుంచి తప్పించుకున్నాడని తాలిబన్ అధికారులు చెప్పారు. 2013లో అతను అజ్ఞాతంలో మృతి చెందాడు. అయినప్పటికీ.. అధికారులు అతని మరణాన్ని ఏళ్లపాటు రహస్యంగా ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్