Afghanistan: అఫ్గాన్ గజగజ.. వారంలో 78 మంది మృతి
అఫ్గానిస్థాన్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలిని తట్టుకోలేక జనం ఇబ్బందులు పడుతున్నారు. గత వారంలోనే తీవ్ర చలి కారణంగా 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ (Afghanistan) ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటువంటి సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం మరింత వారికి శాపంగా మారుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అఫ్గాన్ గజగజ వణుకుతోంది. దీంతో గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించింది.
అఫ్గాన్లో ప్రస్తుతం -35డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతను తట్టుకోలేక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో వారం వ్యవధిలోనే 78 మంది పౌరులతోపాటు 75వేల పశువులు కూడా మృతి చెందినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి షఫీవుల్లా రహీమి వెల్లడించారు. అతిశీతల వాతావరణం కారణంగా చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.. దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 లక్షల మందికి సాధ్యమైనంత మేర సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ (Taliban) చేతుల్లోకి అఫ్గాన్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారిని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించకపోవడంతో ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అక్కడ ఆర్థిక, ఆహార సంక్షోభం ఎక్కువైంది. ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మాత్రం మానవతా సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ, మహిళా వర్కర్లపై తాలిబన్లు పెడుతోన్న ఆంక్షలకు నిరసనగా ఆ స్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న మానవతా సహాయాన్ని నిలిపివేశాయి. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణంతో అక్కడ పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు