Unicef: పాఠశాలలు తెరిచే ఉంచండి: యునిసెఫ్
ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా 61.6కోట్లకుపైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యునిసెఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను
వాషింగ్టన్: ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అయితే, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 61.6 కోట్లకుపైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పాఠశాలలను తెరిచే ఉంచాలని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ ప్రపంచ దేశాలకు సూచించారు.
‘డిజిటల్ కనెక్టివిటీపై పెట్టుబడులు పెడితే.. విద్యార్థులందరికీ ఆన్లైన్ చదువులు అందుతాయని తెలుసు. కానీ, ప్రతి విద్యార్థి పాఠశాలకు తిరిగి వచ్చేలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పాఠశాలకు వస్తేనే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టగలం. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించవచ్చు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం వంటి పథకాలతో విద్యార్థులకు పోషకాలు అందేలా చేయొచ్చు. విద్యార్థుల మౌలిక అవసరాలను తీర్చే వీలుంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా బోధన, బోధనేతర సిబ్బందికి ప్రాధాన్యమిచ్చి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి’’ అని హెన్రిట్టా చెప్పారు.
విద్యార్థులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే.. వాటి పంపిణీలో యునిసెఫ్ మద్దతుగా ఉంటుందని, అయితే, పెద్దలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు వ్యాక్సినేషన్ అవసరం ఉండకపోవచ్చని హెన్రిట్టా అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ విద్యార్థులకి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తే వ్యాక్సిన్ వేసుకొని విద్యార్థులు పాఠశాలలో ప్రవేశానికి అనర్హులవుతారు. దీనివల్ల అసమానతలు ఏర్పడతాయి. అందుకే, డబ్ల్యూహెచ్వో సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టి పాఠశాలలను తెరిచి ఉంచాలని యునిసెఫ్ సూచిస్తోంది. విద్యావ్యవస్థకు కొవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్లను మేం గుర్తించాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని పాఠశాలకు పంపడానికి మనమంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని హెన్రిట్టా పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా