Kim: కిమ్ దారుణాలు..వీడియోలు చూసినందుకు మరణశిక్ష..!
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గడిచిన కొంతకాలంలో ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
దశాబ్ది పాలనలో కిమ్ దారుణాలపై తాజా నివేదిక
సియోల్: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణకొరియాకు సంబంధించిన వీడియోలు చూడడం, వాటిని సరఫరా చేశారనే ఆరోపణలపై వారికి ఈశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. ద.కొరియా పాప్ వీడియోలను ‘విషపు క్యాన్సర్’గా భావించే కిమ్, ఆ సంస్కృతిని ఉత్తరకొరియా దరిచేరకుండా ఉండేందుకేనని ఇలాంటి కఠినచర్యలు తీసుకున్నట్టు చెప్పుకున్నప్పటికీ.. ఇటువంటి దారుణాలకు పాల్పడడం పట్ల తాజా నివేదిక మండిపడింది.
‘కిమ్ జోంగ్ ఉన్ పాలనలో హత్యలు: అంతర్జాతీయ ఒత్తిడితో ఉత్తరకొరియా ప్రతిస్పందన’ పేరుతో సియోల్ కేంద్రంగా ఉన్న ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (TJWG) అనే మానవ హక్కుల సంస్థ తాజాగా ఓ అధ్యయనం జరిపింది. ముఖ్యంగా ఉత్తర కొరియాలో బహిరంగ మరణశిక్షలు ఎక్కడ ఎక్కువగా చేపడుతారు? ఆ మృతదేహాలను పూడ్చివేసే ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గత ఆరేళ్లలో ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఇలా కిమ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన ఓ 23 హత్యలపై నివేదిక రూపొందించింది. వీరిలో ఎక్కువ మందిని సాయుధ బృందంతో కాల్చివేసినట్లు (ఫైరింగ్ స్క్వాడ్) టీజేడబ్ల్యూజీ నివేదిక వెల్లడించింది. మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతోనూ మరికొందరికి మరణశిక్ష అమలుచేసినట్లు వెల్లడింది.
వీడియోలు చూసినందుకు ఏడుగురికి ఉరి..
అధికార పగ్గాలు చేపట్టిన దశాబ్దికాలం కాలం నుంచి దక్షిణకొరియా వినోద రంగంపై గుర్రుగా ఉన్న ఆయన.. అక్కడి పాప్ కల్చర్ను విషపు సంస్కృతిగా భావించారు. దక్షిణకొరియా పాటలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉత్తర కొరియా ప్రజల మనసులను కలుషితం చేస్తాయన్న కిమ్.. వాటిని ఎవరైనా చూసినా, సరఫరా చేసినా మరణశిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చెప్పడమే కాకుండా ఆ ప్రయత్నం చేసిన వారికి బహిరంగ మరణశిక్ష అమలు చేశారు.
ఇలా దక్షిణకొరియాకు చెందిన సినిమా, పాప్ వీడియోలను విక్రయిస్తున్నాడనే నెపంతో ఈఏడాది మే నెలలో ఓ వ్యక్తికి ఉత్తరకొరియా అధికారులు మరణశిక్ష విధించారని దక్షిణకొరియా కేంద్రంగా నడుస్తోన్న ఓ ఆన్లైన్ పేపర్ వెల్లడించింది. తాజాగా టీజేడబ్ల్యూజీ పరిశోధనలోనూ ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ద.కొరియా వినోద కార్యక్రమాలున్న సీడీలు, డ్రైవ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 2012-2014 మధ్యకాలంలో ర్యాంగాంగ్ ప్రావిన్సులోని హైసన్కు చెందిన ఆరుగురికి మరణశిక్ష విధించినట్లు పేర్కొంది. మరో వ్యక్తికి ఉత్తర హాంగ్యాంగ్ ప్రావిన్సులోని చోంగ్జిన్ నగరంలో 2015లో మరణశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్నిసార్లు మరణశిక్ష అమలుచేసే సమయంలో వారి కుటుంబీకులకు బలవంతంగా చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేసే దారుణాలకు కిమ్ అధికారులు పాల్పడినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా కిమ్ పాలనలో ఇప్పటివరకు జరిగిన 23 హత్యలపై నివేదిక రూపొందించినట్లు ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ వెల్లడించింది.
హెచ్చరించేందుకే బహిరంగ శిక్ష..
అక్కడి చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఇటువంటి చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించే లక్ష్యంతోనే కిమ్ ప్రభుత్వం ఈ దారుణాలకు పాల్పడిందని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. అయితే, అక్కడ జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు రావడంతో ఇటీవల మరణశిక్షలను గోప్యంగా చేపడుతున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు చెప్పింది. అంతర్జాతీయ పర్యవేక్షణ పెరగడంతో మానవ హక్కుల సమస్యలపై కిమ్ సామ్రాజ్యం ఎక్కువ దృష్టి సారించినట్లు అధ్యయన రూపకర్త పార్క్ అహ్-యోంగ్ పేర్కొన్నారు. దీనిర్థం ఇక్కడ మానవ హక్కుల పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కాదని.. ఇదివరకు జరిగినట్లు బహిరంగంగా కాకుండా కనిపించని మార్గాల్లో అధికారిక హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని అహ్-యోంగ్ ఆరోపించారు. అంతేకాకుండా సరిహద్దులు, శాటిలైట్లు తేలికగా గుర్తించే ప్రాంతాల్లోనూ వీటిని అమలు చేయడం లేదన్నారు. అయితే, దేశంలో జైలు క్యాంపులు (Prison Camps) ఉన్నాయని వస్తోన్న వార్తలను ఉత్తర కొరియా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి