Marijuana: థాయ్లాండ్లో గంజాయి సాగు ఇక చట్టబద్ధమే, కానీ..
మత్తు పదార్థమైన గంజాయిని సాగు చేయడం, వినియోగించడం భారత్ సహా అనేక దేశాల్లో నిషేధం. అయినప్పటికీ అక్రమంగా ఈ మొక్కల సాగు జరుగుతూనే ఉంది. తాజాగా గంజాయిపై థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అనుమతినిచ్చిన తొలి ఆసియా దేశం ఇదే
బ్యాంకాక్: మత్తు పదార్థమైన గంజాయిని సాగు చేయడం, వినియోగించడం భారత్ సహా అనేక దేశాల్లో నిషేధం. అయినప్పటికీ అక్రమంగా ఈ మొక్కల సాగు జరుగుతూనే ఉంది. తాజాగా గంజాయిపై థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం, ఎక్కువ మొత్తంలో వినియోగించడంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్ డ్రగ్స్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్లాండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇకపై అక్కడ గంజాయిని సాగు చేయడం, ఆహార పదార్థాల్లో, ఔషధాల్లో ఉపయోగించడం అధికారికమే. గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం ఇదే. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్లాండ్ ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక, శుక్రవారం నుంచి 10 లక్షల గంజాయి మొక్కలను ప్రభుత్వమే పంపిణీ చేయనుందట.
అలా చేస్తే భారీ జరిమానా..
వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగును తాము ప్రోత్సహిస్తున్నామని థాయ్ ఆరోగ్య మంత్రి అనుటిన్ చార్న్ విరాకుల్ తెలిపారు. అంతేగాక, దీని సాగుతో దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పాటు చిన్న రైతులకు ఉపాధి లభిస్తుందన్నారు. ‘‘సరైన అవగాహన ఉంటే.. గంజాయి బంగారం లాంటిది. చాలా విలువైనది’’ అని అనుటిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే సరదా కోసం గంజాయిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే 3 నెలల జైలు శిక్షతో పాటు 780 డాలర్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఆహార పదార్థాల్లో 0.2శాతం కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి ఉండటం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పర్యాటకులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుందో లేదో.. పలు రెస్టారెంట్లలో నిన్నటి నుంచే గంజాయితో తయారుచేసిన ఆహార పదార్థాల విక్రయాలు మొదలయ్యాయి. కొందరు గంజాయి మొక్కలతో సంబరాలు చేసుకున్నారు.
వీటిని మరిచారా..?
గంజాయిని చట్టబద్ధం చేయడంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గంజాయి సాగును చట్టబద్ధం చేసిన థాయ్ ప్రభుత్వం.. దీని వినియోగంపై ఉన్న నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు. వినియోగంపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి? గంజాయి సేవించి డ్రైవింగ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే వాటిని ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. కేవలం ఓటర్లను దృష్టిలో ఉంచుకునే ఈ హడావుడి నిర్ణయం తీసుకుందని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.
ఇక, గంజాయి సాగుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు, చిన్న రైతులకు లబ్ధి చేకూరుతుందని థాయ్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆ ప్రయోజనాలు సమానంగా ఉంటాయా అన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా నిర్ణయంతో కొన్ని పెద్ద కార్పొరేషన్లు దీని నుంచి అక్రమంగా లాభాలు ఆర్జించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల చిన్న రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. గంజాయిని చట్టబద్ధం చేయడంతో ఆ నేరం కింద జైలుకు వెళ్లిన దాదాపు 4వేల మందిని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి