Earthquake: భారత్ ఆపన్న హస్తానికి కృతజ్ఞతలు : తుర్కియే భూకంప బాధితులు
కష్టకాలంలో తోడుగా ఉండి భారత సైనికులు అందిస్తున్న సేవలను తుర్కియే భూకంప బాధితులు కొనియాడుతున్నారు.
అంటాక్యా : తుర్కియే, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 28వేలు దాటింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు అక్కడి హతాయ్ ప్రావిన్స్లోని ఇస్కెండ్రన్లో ఏర్పాటు చేసిన 60 పారా ఫీల్డ్ ఆస్పత్రిలో భారతీయ ఆర్మీ విస్తృతంగా సేవలు అందిస్తోంది. 96 మంది భారతీయ వైద్య సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. కష్టకాలంలో భారత్ అందిస్తున్న ఆపన్న హస్తానికి తుర్కియే ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారత ఆర్మీ ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్కు ధన్యవాదాలు. కష్టకాలంలో మాకు తోడుగా ఉన్నందుకు అభినందనలు. భారత ఆర్మీ సిబ్బంది సేవలు పొందుతున్నందుకు సంతోషిస్తున్నామని’ చెప్పాడు. ఇటీవల ఓ తుర్కియే మహిళ సైన్యం అందిస్తున్న సహాయాన్ని మెచ్చి భారత సైనికురాలిని ముద్దాడగా ఆ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
భారత ఆర్మీ తుర్కియేలోని హతాయ్ ప్రావిన్స్లో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. భూకంపం సంభవించిన ఆరు గంటల్లోనే అక్కడ ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఇప్పటిదాకా నిరంతరాయంగా సేవలు అందుతున్నాయి. తాత్కాలిక ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 800 మందికి చికిత్స అందజేసి.. వారి ప్రాణాలు కాపాడినట్లు భారత లెఫ్టినెంట్ కల్నల్ యదువీర్ సింగ్ మీడియాకు తెలిపారు. అవసరం ఉన్నన్ని రోజులు వైద్య సేవలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. భూకంప బాధితుల్లో 10 మందికి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా చేసినట్లు మరో ఆర్మీ అధికారి తెలిపారు.
తుర్కియే, సిరియాలో ఇప్పటిదాకా భూకంప మృతుల సంఖ్య 28వేలకు పైగా చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు వణికించే మంచులోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా శిథిలాల్లోనే మగ్గిపోతున్న వారిని వేగంగా బయటకు తీసుకురాగలిగితేనే వారి ప్రాణాలు కాపాడగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రస్ అథనోమ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?