Indonesia: సూర్యోదయం చూద్దామని వెళితే పాడు పనులు ఎదురవుతున్నాయి..
ఇండోనేషియాలోని బాలి పర్యాటక ప్రాంతంలో సూర్యోదయం చూద్దామని వెళ్లేవారికి పాడు పనులు ఎదురవుతున్నాయి. ఇక్కడి పవిత్ర పర్వతాలపై విదేశీ టూరిస్టుల అసభ్య ప్రవర్తన ఘటనలు స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
బాలి: ఇండోనేషియా(Indonesia)లోని బాలి(Bali) ద్వీపంలో పర్యాటకం(Tourism) ముసుగులో కొందరు పర్యాటకులు చేస్తున్న అరాచకాలు స్థానికులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. బాలి ద్వీపంలో 90 శాతం వరకు హిందువులే కావడం విశేషం. దీవిలోని పలు పర్వతాలను పవిత్రంగా పూజిస్తారు. ఈ పర్వతాలను దేవతలు, తమ పూర్వీకులు ఉండే ప్రాంతాలుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, ఇవేమీ పట్టించుకోని ఇతర దేశాల టూరిస్టులు(Foreign tourists) చేస్తున్న పాడు పనులు తమ సంప్రదాయాలను, విశ్వాసాలను ఘోరంగా అవమానిస్తున్నాయని వాపోతున్నారు.
ఏం జరిగింది?
బాలిలో హిందువులు పవిత్రంగా భావించే బాటుర్ శిఖరం(Mount Batur)తో పాటు ఇతర పర్వతాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇక్కడి నుంచి సూర్యోదయ దృశ్యాలను చూసేందుకు స్థానికులతోపాటు వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే, విదేశీ టూరిస్టులు ఈ పర్వతాలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. పర్వతాలపై వారంతా సమూహంగా చేరడం, కొందరు నగ్నంగా నృత్యాలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నగ్నంగా నృత్యాలు చేయడంతో కెనడా పర్యాటకుడిని బలవంతంగా వెనక్కు పంపించివేశారు. రష్యాకు చెందిన ఓ నటి అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి.
అవి పవిత్ర పర్వతాలు..
ఈ వ్యవహారంపై స్పందించిన బాలి గవర్నర్ కొత్త నియమావళిని జారీ చేశారు. పర్వతాలను పవిత్రమైనవిగా గుర్తించడంతోపాటు వాటి పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. బాలిలో పర్వతాలపై దూషణలు చేస్తే వాటిని నేరంగానే పరిగణిస్తారు. పర్యాటకులు స్థానిక సంప్రదాయాలను గౌరవించడంతోపాటు స్థానిక చట్టాలను పాటించాలని అధికారవర్గాలు విజ్ఞప్తి చేశాయి. అన్ని చట్టాలను పాటిస్తామని హామీ ఇస్తేనే వారిని బాలిలోకి అనుమతించాలని స్థానికులు సూచించారు. పర్యాటక రంగంపై ఆధారపడి వున్న వారి జీవనభృతికి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?