Ukraine Crisis: రష్యా వాడుతున్న ఆయుధాలివే..
క్రెయిన్ నగరాలపై రష్యా దాడుల చిత్రాలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఈ క్రమంలో రష్యా భారీ సంఖ్యలో ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం విమానాలు, క్షిపణులు, శతఘ్నులను, పదాతి దళాలను
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడుల చిత్రాలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఈ క్రమంలో రష్యా భారీ సంఖ్యలో ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం విమానాలు, క్షిపణులు, శతఘ్నులను, పదాతి దళాలను ఒక ప్యాకేజీలా వాడి ఉక్రెయిన్ను దెబ్బతీసింది. ఈ క్రమంలో నిన్నటి వరకూ మొత్తం 80 స్థావరాలను ధ్వంసం చేసింది. రష్యా వాడిన ఆయుధాలివే..
శతఘ్నులు.. క్షిపణులు..
ఉక్రెయిన్ సరిహద్దుల సమీపంలోనే అసెంబ్లింగ్ చేసిన స్వల్ప, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూజ్ క్షిపణులు, శక్తిమంతమై శతఘ్నులు వినియోగించి ప్రభుత్వ భవనాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకొన్నాయి. రష్యా దళాలు మొత్తం 160 క్షిపణులను ఉక్రెయిన్లోని లక్ష్యాలపై ప్రయోగించాయి. వీటిల్లో కల్బిర్ క్రూజ్ క్షిపణులు, సికిందర్ టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. దీంతోపాటు క్రూజ్ క్షిపణులు, సముద్రంపై నుంచి దాడి చేసే క్షిపణలు, విమానాలపై నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగించినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. దీంతోపాటు స్మెర్చ్ రాకెట్ లాంఛర్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్లో దొరికిన శకలాలు చెబుతున్నాయి. ఒక ట్రక్పై నుంచి 38 క్షణాల్లో 12 రౌండ్ల స్మెర్చిలను పేల్చగలదు. కాకపోతే వీటిపై లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే గైడెడ్ వ్యవస్థ ఉండదు. వీటితోపాటు ఉర్గాన్ మల్టీ రాకెట్ లాంచర్లను కూడా వినియోగించినట్లు భావిస్తున్నారు.
75 విమానాలు వాడి..
ఇటీవల కాలంలో ఉక్రెయిన్ను చుట్టుముట్టిన తర్వాత రష్యా ప్రత్యేక విమానాలను కూడా సరిహద్దుల సమీపంలోకి తీసుకొచ్చింది. ఇవి క్లస్టర్ బాంబులు, పెద్ద ఎత్తున లోహపు తునకలు వెదజల్లే ఫ్రాగ్మెంటేషన్ బాంబులను ప్రయోగించగలవు. వీటితోపాటు గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో దాడి చేయగలవు. ఇలాంటివి మొత్తం 75 విమానాలను ఉక్రెయిన్పై దాడికి వాడినట్లు అమెరికా రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. దీంతోపాటు కీవ్ వైపు దాదాపు రెండు డజన్ల ఎంఐ-8 హెలికాప్టర్లను కూడా వినియోగించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, మందుగుండు గోదాములను పేల్చి వేయడానికి వినియోగించారు. దీంతోపాటు కీవ్ వద్ద కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్లను కూడా ధ్వంసం చేశారు.
గ్రౌండ్ వెహికల్స్..
రష్యా భారీ ఎత్తున సాయుధ వాహనాలు, ట్యాంకులను ఈ దాడికి వాడింది. ఈ క్రమంలో ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న గ్లుఖోవ్ వద్ద అమెరికా సరఫరా చేసిన జావెలిన్ క్షిపణితో ఓ టి-72 ట్యాంక్ను ఉక్రెయిన్ ధ్వంసం చేసిన చిత్రాలూ వెలుగులోకి వచ్చాయి. దీనికి తోడు రష్యాకు చెందిన చాలా వాహనాలు తమ గుర్తింపు తెలిసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసుకొని ఉక్రెయిన్లోకి ప్రవేశించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్