Global Warming: ఉద్గారాలు తగ్గినప్పటికీ.. వచ్చే దశాబ్దంలోనే 1.5 డిగ్రీలకు భూతాపం!
వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల తగ్గినప్పటికీ వచ్చే దశాబ్దంలోనే భూతాపం 1.5 డిగ్రీలు దాటుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ ఆధారంగా ఈ అంచనా వేసింది.
వాషింగ్టన్: ఉద్గారాలు(Emissions) తగ్గినప్పటికీ.. రానున్న 10- 15 ఏళ్లలో భూతాపం(Global Warming) పెరుగుదల 1.5 డిగ్రీలు దాటుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఒకవేళ ఉద్గారాల విడుదల అధికంగా ఉంటే.. ఈ శతాబ్దం మధ్య నాటి(2050)కే భూతాపం పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోల్చితే సగటున రెండు డిగ్రీలు పెరిగే అవకాశం రెండింట ఒకవంతుగా ఉందని అధ్యయనం అంచనా వేసింది. 2060 నాటికి ఐదింట నాలుగువంతుల కంటే ఎక్కువ అవకాశం ఉందని తెలిపింది. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన ఇటీవలి ఉష్ణోగ్రతల వివరాలను ఉపయోగించి కృత్రిమ మేధ(AI) సాయంతో భవిష్యత్తు వాతావరణ మార్పులను ఇందులో అంచనా వేశారు.
భవిష్యత్తు వాతావరణ మార్పుల అంచనా విషయంలో పూర్తిగా కొత్త విధానాన్ని ఉపయోగించి ఈ అధ్యయనాన్ని రూపొందించినట్లు ప్రధాన రచయిత, అమెరికా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త నోహ్ డిఫెన్బాగ్ చెప్పారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త, అధ్యయన సహ రచయిత ఎలిజబెత్ బర్న్స్తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. ‘ఒకవేళ నెట్-జీరో ఉద్గారాల స్థాయికి చేరుకునేందుకు మరో అర శతాబ్దం పట్టినట్లయితే.. అప్పటికి భూతాపం 2 డిగ్రీల సెల్సియస్ మించిపోయే అవకాశం ఉంది’ అని తమ ఏఐ మోడల్ అధ్యయనంలో తేలిందన్నారు. తాజా అధ్యయనంలో పరిశోధకులు ‘న్యూరల్ నెట్వర్క్’ అనే కృత్రిమ మేధ ఉపయోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ