EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!
తుర్కియే(Turkey)లో నిన్న ప్రధాన భూకంపం తర్వాత మరో 100 భూప్రకంపనలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: తుర్కియే(Turkey)లో నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం(EarthQuake) సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడంలేదు. రిక్టర్ స్కేల్పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. తొలుత భారీ భూకంపం(EarthQuake) వచ్చిన తర్వాత చిన్నచిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా 5.0-6.0 తీవ్రతతో మరికొంతకాలం పాటు ఈ ప్రకంపనలు రావొచ్చని వారు పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు కూలవచ్చని తెలిపారు. దీంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
భారీగా దెబ్బతిన్న తుర్కియే(Turkey) కీలక పోర్టు
మధ్యదరా సముద్రంలో ఉన్న తుర్కియే(Turkey) కీలక నగరం ఇసికందరన్లోని లిమాక్ పోర్టు భూకంపం(EarthQuake) దెబ్బకు తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ కంటైనర్లను ఉంచిన ప్రదేశంలో భారీగా అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. తుర్కియే(Turkey)లోని విద్యుత్తు వ్యవస్థ, సహజ వాయు పైపు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ రంగ పైపులైన్ ఆపరేటర్ బోటాస్ దీనిపై కీలక ప్రకటన చేసింది. గాజాయాంటెప్, హటే, కహ్రామన్మరాస్ ప్రావిన్స్లకు పైపు లైన్లో గ్యాస్ సరఫరాలను ఆపివేసినట్లు పేర్కొంది. కహ్రామన్మరాస్లోని పైపులైను భూకంప(EarthQuake) కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో ఆస్పత్రులకు, ఆహారశాలలకు, గ్యాస్ సరఫరా వ్యవస్థలకు విద్యుత్తును అందించేందుకు అత్యవసర చర్యలను చేపట్టింది. తమ మొబైల్ విద్యుత్తు ప్లాంట్లను ఆయా ప్రదేశాలకు పంపినట్లు టర్కీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పేర్కొంది. అక్కుయు అణు విద్యుత్తు కేంద్రానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేను విమానం డోర్ పక్కన కూర్చోనుగా’: బోయింగ్ ఘటనలపై బైడెన్ చమత్కారం
బోయింగ్ (Boeing) సంస్థ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తన ఎయిర్ఫోర్స్ వన్ విమానం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్కు ప్రశ్న ఎదురైంది. -
బాల్టిమోర్ వంతెన వద్దకు భారీ క్రేన్ల తరలింపు!
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీ కొట్టడంతో కుప్పకూలిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన శకలాలను తొలగించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
అంధుల కోసం ప్రత్యేక పరికరం
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వాటర్టౌన్ నగరంలోని పెర్కిన్స్ అంధుల పాఠశాలలో సరికొత్తగా ఆవిష్కరించిన ‘లైట్సౌండ్’ పరికరాన్ని పరీక్షిస్తున్న అసిస్టివ్ టెక్నాలజీ మేనేజర్ మిన్ హా. -
నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డుపై నెట్టింట ఆగ్రహం
హమాస్ అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర దుమారం రేపింది. -
విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా... ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్క రోజే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. -
భారత్ సహకారం కోసం ఉక్రెయిన్ వినతి
భారత్, ఉక్రెయిన్ మిత్ర దేశాలనీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రెండు దేశాల మధ్యనున్న సహకార బంధాన్ని పునరుద్ధరించుకోవాలని నిశ్చయించాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా శుక్రవారం ఉద్ఘాటించారు. -
ఈస్టర్ వేడుకకు వెళ్తుండగా లోయలో పడిన బస్సు
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్ వేడుకకు భక్తులను తీసుకెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది. -
ఉపసంహరించుకున్న సప్లిమెంట్లు వాడి.. జపాన్లో అయిదుగురి మృతి
జపాన్లో కొన్ని ఆరోగ్య సంపూరకాల (హెల్త్ సప్లిమెంట్లు) వినియోగం వల్ల మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. -
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు విదేశీ కీలుబొమ్మ: ముయిజ్జు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిపై ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు విమర్శలు గుప్పించారు. -
మాస్కో సంగీత హాల్పై దాడి.. మరో తొమ్మిది మంది అరెస్టు
గత వారం మాస్కోలోని సంగీత కచేరి హాల్పై జరిగిన దాడితో సంబంధం ఉందన్న అనుమానంతో శుక్రవారం తొమ్మిది మందిని తజకిస్థాన్ జాతీయులను ఆ దేశ స్టేట్ సెక్యూరిటీ సర్వీసు అదుపులోకి తీసుకుంది. -
నాటో దేశాలపై దాడులు చేయం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
హమాస్తో యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు. -
సముద్రంలో మరో ఆపరేషన్.. 23 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ
ఇరాన్కు చెందిన చేపల బోటు హైజాక్ కావడంతో ఇండియన్ నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందులో ఉన్న 23 మంది పాక్ పౌరులైన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. -
మరో పడవ హైజాక్.. రంగంలోకి భారత నేవీ
అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఓ ఇరాన్ పడవను రక్షించేందుకు భారత నౌకాదళం (Indian Navy) మరోసారి రంగంలోకి దిగింది. -
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తోన్న రష్యా.. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
-
స్టార్క్ అదరగొట్టేస్తాడు.. కాకపోతే కాస్త సమయం అవసరం: స్టువర్ట్ బ్రాడ్
-
పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు
-
కేటీఆర్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు
-
అవును.. నేను రిలేషన్లో ఉన్నా: విజయ్ దేవరకొండ
-
మద్యం కేసులో.. మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు