Thailand: థాయ్లాండ్ పిలుస్తోంది.. ‘తేలియాడే రైలు’ రమ్మంటోంది
థాయ్లాండ్లో ఎంతో ప్రత్యేకమైన తేలియాడే రైలు ప్రయాణం ప్రారంభమైంది. నవంబరు- ఫిబ్రవరి మధ్య వారాంతాల్లో మాత్రమే నడిమే ఈ రైలు ప్రయాణానికి పర్యాటకులు పొటెత్తుతున్నారు. ఇప్పటికే జనవరి వరకు టికెట్లు అమ్ముడు పోయాయి.
ఇంటర్నెట్డెస్క్: అందమైన సముద్ర తీరాలు, పెద్దపెద్ద సరస్సులు, ఆహ్లాదం పంచే వాతావరణం.. థాయ్లాండ్ అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇవి మెదులుతాయి. ప్రపంచ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఈ దేశం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు బడాబడా వ్యక్తులంతా విశ్రాంతి కోసం ఎక్కువగా ఇక్కడికే వెళ్తుంటారు. థాయ్లాండ్లో ‘తేలియాడే రైలుకు’ ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగని ఇది నీటి మీద తేలుతుందనుకునేరు. పెద్దపెద్ద సరస్సుల మధ్యలోంచి థాయ్లాండ్ అందాలను వీక్షించేందుకు వీలుగా పసక్ జోలాసిడ్ వంతెనను ఏర్పాటు చేశారు. దీనిపై రైలు వెళ్తుంటే నీటి మీదనే ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంకో విశేషమేంటంటే.. థాయ్లాండ్లో మట్టితో నిర్మించిన వంతెనల్లోకెల్లా ఇదే అతిపొడవైన వంతెనట. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలు దేరితే ఒక రోజు మొత్తం ఈ రైళ్లో తిరగొచ్చు. ఈ వంతెనపై దాదాపు 6 గంటల పాటు ప్రయాణం సాగుతుంది. అన్ని బ్రిడ్జి స్టేషన్లలోనూ దాదాపు 20 నిమిషాల పాటు రైలును ఆపుతారు. అందరూ సరదాగా ఫొటోలు తీసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది.
రూ.725కే రైలు ఎక్కొచ్చు!
ఈ రైలు నవంబరు- ఫిబ్రవరి మధ్యలో కేవలం వారాంతాల్లో మాత్రమే నడుస్తుంది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో మాత్రం నడపరు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సరస్సులన్నీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. దాదాపు పసక్ జోలాసిడ్ వంతెనను తాకేలా నీటిమట్టం ఉంది. దీంతో ‘తేలియాడే రైలు’ ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే జనవరి వరకు టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు థాయ్లాండ్ మీడియా వెల్లడించింది. కొవిడ్ మహమ్మారితో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోవడంతో థాయ్లాండ్ ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇటీవల పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా రైలు ప్రయాణం కూడా ప్రారంభం అవ్వడంతో మరింత మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తోంది. బ్యాంకాక్లోని హువాలాంఫాంగ్ నుంచి పసక్ జోలాసిడ్ వంతెన వరకు నాన్ ఏసీలో ప్రయాణిస్తే రూ.725, ఏసీ అయితే రూ. 1230 టికెట్ వసూలు చేస్తారు. నవంబరు 1 నుంచి టికెట్లు విక్రయిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా విహారయాత్రకు థాయ్లాండ్ వెళ్లాలనుకుంటే ఇదో చక్కని అవకాశం..తేలియాడే రైలుపై ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. -
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు