China: చైనా కొవిడ్ జీరో వ్యూహం అమలు వెనుక.. ప్రధాన కారణం అదే..!
మాస్ టెస్టింగ్, కఠిన లాక్డౌన్లు అమలు చేస్తూ కరోనా మీద ఎవరూ చేయని రీతిలో చైనా గట్టి పోరాటం చేస్తోంది.
బీజింగ్: మాస్ టెస్టింగ్, కఠిన లాక్డౌన్లు అమలు చేస్తూ కరోనా మీద ఎవరూ చేయని రీతిలో చైనా గట్టి పోరాటం చేస్తోంది. అందుకోసం కొవిడ్ జీరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చినా, ఇంకా ఈ విధానం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినా డ్రాగన్ దేశం దీన్నే అమలుచేస్తూ ముందుకెళ్తోంది.
గత కొద్ది వారాలుగా చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అక్కడి ప్రముఖ నగరం షాంఘై కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లి, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. కాగా, తాజా వేవ్తో 50 నుంచి 80 ఏళ్ల మధ్యలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోనివారేనని తెలుస్తోంది. అంటే అర్థం వారిలో వైరస్ వల్ల తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్ ఉద్ధృతి, వయసు పైబడిన వారిలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటమూ ఈ కొవిడ్ జీరో విధానాన్ని కఠినంగా అమలు చేయడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
భారీస్థాయిలో వైద్య సదుపాయాలు, విరివిగా స్వదేశీ టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చైనాలో తక్కువ వ్యాక్సినేషన్ రేటుకు కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ రెండేళ్లలో టీకాల పరంగా ప్రపంచం మొత్తం ప్రమాదం పొంచి ఉన్న వర్గానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సమయంలో వృద్ధులకు టీకాలు వేసే అవకాశాన్ని చైనా కోల్పోయిందని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ఫెంగ్ వాంగ్ వెల్లడించారు. 60ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 216 మిలియన్ల మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని చైనీస్ నేషనల్ హెల్త్ ఇటీవల వెల్లడించింది. ఇది ఆ వయస్సువారిలో 82 శాతం మందికి సమానం. అయితే 80 ఏళ్లు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకుంటే టీకా పొందిన వారి సంఖ్య తగ్గిపోతోంది. 80ఏళ్లు పైడిన వారిలో మార్చి వరకు 50 శాతం మందికి మాత్రమే టీకా అందింది. అంతేగాకుండా స్వదేశంలో అభివృద్ధి చేసిన టీకా ప్రభావశీలత మిగిలిన వాటితో పోల్చితే తక్కువగా ఉంది. చైనా టీకాలకు సంబంధించి బ్రెజిల్లో జరిపిన అధ్యయనంలో తీవ్రమైన వ్యాధిని నివారించడంలో కరోనావాక్ టీకా 30 శాతం సామర్థ్యాన్ని మాత్రమే కలిగిఉందని తేలింది. అదే 80ఏళ్లు పైబడిన వారిలో మరణాలను నివారించే విషయంలో 45 శాతం సామర్థాన్ని చూపిందని వెల్లడైంది. ఇక ఆక్స్ఫర్డ్ టీకా విషయానికి వస్తే.. దాని ప్రభావశీలత వరుసగా 67 శాతం, 85 శాతంగా ఉంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ అధ్యయనాలను విస్మరించి, దేశ గౌరవాన్ని పెంపొందించుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా హాంకాంగ్, షాంఘైలో వృద్ధుల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఆ రెండు ప్రాంతాల్లో 80 ఏళ్లు పైబడిన వారిలో వ్యాక్సినేషన్ రేటు అతి స్వల్పంగా ఉంది. ఇదిలా ఉండగా.. చైనా కొవిడ్ జీరో వ్యూహాన్ని పక్కన పెడితే అక్కడ 1.6 మిలియన్ల మరణాలు సంభవించే అవకాశం ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చైనా ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. నగదు వోచర్లతో పాటు ఉచిత వంటనూనె, గుడ్లు, పాలు, కిరాణా సామాగ్రిని అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు