Robot police: అక్కడ.. నేరగాళ్లని చంపే రోబో పోలీసులు రాబోతున్నారు..!
కాల్పుల వంటి తీవ్రమైన ఘటనలకు ప్రయత్నించే నేరగాళ్లను చంపే రోబో పోలీసులను ఉపయోగించాలని అమెరికా పోలీసులు యోచిస్తున్నారు.
(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోతోంది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వర్జీనియాలోని ఓ వాల్మార్ట్ స్టోర్లో ఓ మేనేజర్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. కాల్పుల వంటి తీవ్రమైన ఘటనలకు ప్రయత్నించే నేరగాళ్లను చంపే రోబో పోలీసులను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ముసాయిదా ప్రణాళికను రూపొందించారు.
శాన్ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో ప్రస్తుతం 17 రోబోలు ఉన్నాయి. అయితే ఇందులో 12 నిర్వహణలో లేవు. మిగతా వాటిని బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే తీవ్రమైన నేర ఘటనల్లోనూ వీటిని వినియోగించాలని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల వంటి ఘటనలను తిప్పికొట్టే క్రమంలో నేరగాళ్లను చంపేసేలా రోబోల సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నారు. మెషిన్లు, గ్రనేడ్ లాంఛర్లతో రోబోలను మార్చాలని డ్రాఫ్ట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ ముసాయిదా ప్రణాళికపై వచ్చేవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఇప్పటికే పలు దేశాల్లో పోలీసు విభాగాల్లో రోబోలు విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
Social Media: సోషల్ మీడియాలో ఆదరణ కోసం కొంత మంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనికి సొంత బిడ్డే బలయ్యాడు. -
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తామని, ఒకవేళ వారు పాకిస్థాన్కు పారిపోయినా వదలమని మనదేశం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందించింది. -
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
Dubai Rains: దుబాయ్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎయిర్పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. -
రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు!
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. -
యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. -
పత్రాల్లో పొరపాటు.. ఒక జంట బదులు మరొకరికి విడాకులు
బ్రిటన్లోని ఓ సంస్థ చేసిన చిన్న తప్పువల్ల ఒక జంట బదులు మరో జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఆన్లైన్ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. ఇంకా అది చర్చల దశలో ఉండగానే విడాకులు పొందారు. -
అనుమతి లేకుండా అశ్లీల డీప్ఫేక్ చిత్రాలు సృష్టించడం నేరమే: బ్రిటన్
వ్యక్తుల అనుమతి లేకుండా, వారి అశ్లీల చిత్రాలను డీప్ఫేక్ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. -
మహమ్మారుల నిరోధంలో 50 దేశాలకు అమెరికా చేయూత
కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. -
అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు
అమెరికాలో హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయని, ఇవి మరింత ఉద్ధృతం కావొచ్చని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఏఐ’ భామలకు.. అందాల పోటీ..!
కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం ‘మిస్ ఏఐ’ పోటీ సిద్ధమైంది. మిస్ ఇండియా వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. -
కోర్టులో కునుకు తీసిన ట్రంప్..?
తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్న కేసులో భాగంగా కోర్టు ఎదుట హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. విచారణ సమయంలో కునుకు తీసినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన బృందం స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’పై వార్తలు.. నాగవంశీ పోస్ట్ వైరల్
-
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
-
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
-
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
-
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు