India- China: క్వాడ్లో భారత్ అందుకే చేరింది: పాంపియో
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన తాజా పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారత్- చైనా మధ్య సంబంధాలను విశ్లేషిస్తూ తాము అధికారంలో ఉన్నప్పటి కొన్ని ఉదంతాలను ప్రస్తావించారు.
వాషింగ్టన్: చైనా (China) దురహంకార చర్యలను నిలువరించడానికే క్వాడ్ (Quad) కూటమిలో భారత్ చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో (Mike Pompeo) అన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించే భారత్.. చైనా దుందుడుకు చర్యల కారణంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’లో పాంపియో పేర్కొన్నారు.
2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ (Galwan Clash)లోయలో భారత్ - చైనా మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరుపక్షాల వైపు పలువురు సైనికులు మరణించారు. ఈ ఉదంతం తర్వాత ఉభయ దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తన కొత్త పుస్తకంలో భారత్ను సామ్యవాద పునాదులపై ఏర్పడిన దేశంగా పాంపియో అభివర్ణించారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇటు అమెరికా, అటు రష్యా.. ఏ కూటమిలోనూ చేరకుండా భారత్ స్వతంత్ర వైఖరిని అవలంబించిందని పేర్కొన్నారు. ఇప్పటికీ దాదాపు అదే విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు.
2024లో పాంపియో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉందని అమెరికాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆగడాలను నిలువరించడమే లక్ష్యంగా 2017లో క్వాడ్ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా ఈ కూటమిలో సభ్య దేశాలు. భారత్ను ఈ కూటమిలోకి తీసుకురావడంలో ట్రంప్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం విజయవంతమైందని పాంపియో అన్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు భారత్లో ఊపందుకున్నాయని పుస్తకంలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ సహా పలు చైనా యాప్లను భారత్ నిషేధించినట్లు పాంపియో పేర్కొన్నారు.
భారత్, చైనా మధ్య దూరం పెరగడానికి కారణమేంటన్న ప్రశ్న తనకు తరచూ ఎదురయ్యేదని పాంపియో ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ‘‘అమెరికా- భారతదేశం మధ్య గతంలో ఎన్నడూ లేనంత దగ్గరి సంబంధాలను ఏర్పరచుకోవడానికి తాము అవకాశాలను సృష్టించుకుంటున్నాం అని ఆ ప్రశ్నవేసేవాళ్లకు సమాధానమిచ్చే వాళ్లం’’ అని పాంపియో పేర్కొన్నారు. భారత నాయకత్వం నుంచి కూడా తనకు ఇదే తరహా సమాధానం తరచుగా వినిపించేదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.