Beijing: ఐసొలేషన్ వీడాడు.. వేల మందిని ఇళ్లకు పరిమితం చేశాడు!
ఇంట్లోనే ఉండాలన్న ఆదేశాలను విస్మరించిన ఓ వ్యక్తి.. తాజాగా చైనా రాజధాని బీజింగ్లో వేలమంది క్వారంటైన్కు కారణమయ్యాడు. ఎందుకంటే.. ఆయనకు కొవిడ్ పాజిటివ్గా తేలడమే. దీంతో.. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు...
బీజింగ్: ఇంట్లోనే ఉండాలన్న ఆదేశాలను విస్మరించిన ఓ వ్యక్తి.. తాజాగా చైనా రాజధాని బీజింగ్లో వేలమంది క్వారంటైన్కు కారణమయ్యాడు. ఎందుకంటే.. ఆయనకు కొవిడ్ పాజిటివ్గా తేలడమే. దీంతో.. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. మహమ్మారి మొదలు నగరంలో అతిపెద్ద వ్యాప్తిని అరికట్టేందుకుగానూ అధికారులు గత ఐదు వారాలుగా లక్షలాది మంది స్థానికులను ఇంట్లోనే ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే, సన్ అనే ఇంటిపేరుతో ఉన్న 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం.. ఇటీవల ‘హై రిస్క్’గా ప్రకటించిన షాపింగ్ సెంటర్ను సందర్శించారు. దీంతో.. ఆయన్ను ఐసొలేషన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. అయితే, దీన్ని ఉల్లంఘిస్తూ.. ఆయన చాలాసార్లు బయటకు వెళ్లి వచ్చినట్లు బీజింగ్ ప్రజాభద్రతా అధికారి పాన్ జుహోంగ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సన్, ఆయన భార్యకూ తాజాగా పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వారి పరిసరాల్లో నివాసముండే అయిదు వేల మందిని క్వారంటైన్ చేశారు. 250 మందిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇదిలా ఉండగా.. అధికారులు సోమవారం బీజింగ్లో కొవిడ్ ఆంక్షలు సడలించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని ప్రకటిస్తూ.. పార్కులు, మ్యూజియంలు, సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రాజధానిలోని ఆయా డిస్ట్రిక్స్లో బస్సులు, సబ్వే, టాక్సీ సేవలు పునఃప్రారంభమయ్యాయి. విధులకు రమ్మని పౌరులకు ఆదేశాలు వచ్చాయి. అయితే, పాఠశాలలు మాత్రం మూసి ఉన్నాయి. సూపర్ మార్కెట్లతోసహా ప్రజాకేంద్రాల్లో ప్రవేశాలకు నెగెటివ్ రిపోర్టు నిబంధన కొనసాగుతోంది.
చైనా వాణిజ్య కేంద్రమైన షాంఘై కూడా జూన్ 1 నుంచి వ్యాపారాలను తిరిగి ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా నగరవ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే నగర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకుగానూ.. ఆస్తి పన్నులు తగ్గించడం, వ్యాపారాలకు గ్యాస్, విద్యుత్తుపై రాయితీలు, చిన్న మధ్య తరహా సంస్థలకు మరిన్ని రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించడం వంటి చర్యలను ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్