Viral news: ఇదేం ఏటీఎంరా బాబోయ్.. గుట్టంతా విప్పేస్తోంది!
అమెరికాలో మియామీ బీచ్లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్ ఫొటో తీసి.. అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్ప్లే అవుతోంది
ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా ఏటీఎంకి వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకుంటాం. వేరేవారు తమ అకౌంట్ వివరాలు తెలుసుకొని డబ్బులు దోచుకుంటారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్ ముగిసిన తర్వాత కొంత మంది నంబర్ బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకి వస్తారు. అంటే, బ్యాంకు బ్యాలెన్స్గానీ, ఇతర వివరాలు గానీ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడతారు. కానీ, అమెరికాలో మియామీ బీచ్లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్ ఫొటో తీసి.. అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్ప్లే అవుతుంది. బ్యాలెన్స్ పక్కనే కస్టమర్ ఫొటో కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ పేరు మొదటి స్థానంలో ఉండి.. ఆ తర్వాత అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది.
ఈ ఏటీఎంను న్యూయార్క్కు చెందిన ఎమ్ఎస్సీహెచ్ఎఫ్ సంస్థతో కలిసి పెర్రోటిన్గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మకంగా దీనిని మియామీ బీచ్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చట. వైవిధ్యంగా ఉండటంతో చాలా మంది కస్టమర్లు దీనిని ఉపయోగించేందుకు ఎగబడుతున్నారు. కొందరు ఏటీఎంలో కార్డు పెట్టి.. ముఖం కనిపించకుండా కవర్ చేస్తే.‘BYE, Bloody Boys’ అంటూ సందేశం డిస్ప్లే అవుతోంది. దీనిని చూసుకొని వారంతా నవ్వుకుంటూ పక్కకి వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జోయల్ ఫ్రాంకో అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎక్కువ మంది మాత్రం వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని, ఎవరి అకౌంట్లో ఎంత ఉంటే ఇతరులకు ఎందుకు? అని వాదిస్తున్నారు. ఇలాంటి పద్ధతి చాలా ప్రమాదకరమని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. ఏదేమైనా.. సాంకేతికతను సరైన మార్గంలో వాడుకోకపోతే ప్రమాదమే కదా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!