Ukraine Crisis: కీవ్ పర్యటనలో యూరప్ ముఖ్య నేతలు.. ఉక్రెయిన్కు సంఘీభావం
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్వాసులకు సంఘీభావం తెలిపేందుకు ఏకకాలంలో నలుగురు కీలక యూరోపియన్ నేతలు కీవ్కు చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో...
కీవ్: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్వాసులకు సంఘీభావం తెలిపేందుకు ఏకకాలంలో నలుగురు కీలక యూరోపియన్ నేతలు కీవ్కు చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి గురువారం రైలులో పోలండ్ నుంచి ఉక్రెయిన్కు చేరుకోగా.. రొమేనియా అధ్యక్షుడు క్లాజ్ ఐహోవానిస్ సైతం కీవ్లో వారికి తోడయ్యారు. రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత నాలుగు యూరోపియన్ దేశాల ముఖ్య నేతలు ఒకేసారి కీవ్ను సందర్శించడం ఇదే మొదటిసారి. అనంతరం వారంతా ఉక్రెయిన్వాసులపై రష్యన్ సేనల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు.
కీవ్లోకి చొరబడాలనుకున్న రష్యన్ సైన్యాన్ని ఉక్రెనియన్లు ఇక్కడే అడ్డుకున్నారని మెక్రాన్ గుర్తుచేశారు. అక్కడి పౌరులు, సైనికుల వీరత్వాన్ని ప్రశంసించారు. రష్యాను ఉక్రెయిన్ తప్పనిసరిగా ఎదిరించాలని.. ఈ క్రమంలో విజేతగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇదో ముఖ్యమైన క్షణం. మేమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఉక్రెనియన్లకు చేరవేస్తున్నాం’ అని తెలిపారు. రష్యాను ఎదుర్కొనేలా అవసరమైనంత కాలం ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక, మానవతా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జర్మనీ ఛాన్స్లర్ షోల్జ్ హామీ ఇచ్చారు. ఐరోపా దేశాల సాయంతో ఉక్రెయిన్లో ప్రతిదీ పునర్నిర్మిస్తామని ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి భరోసా ఇచ్చారు. అనంతరం వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు.
సైనిక చర్య మొదట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో పదేపదే సంభాషించడం, ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం వంటి చర్యలతో యూరప్లోని కీలక దేశాలుగా ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత పర్యటన యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్కు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని చాటేవిధంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రష్యా దళాలు తూర్పు డాన్బాస్ ప్రాంతంలో తమ దాడులను ఉద్ధృతం చేస్తున్నాయి. ఉక్రెయిన్ బలగాలపై క్రమంగా పైచేయి సాధిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!