Tonga: ‘ఆ పేలుడు శక్తి.. వందల హిరోషిమా అణుబాంబులకు సమానం’
ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇదిలా ఉండగా, ఈ అగ్నిపర్వత విస్ఫోటం.. జపాన్లోని హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో విడుదలైన శక్తి.. 5- 30 మెగాటన్నుల టీఎన్టీ మధ్యలో ఉంటుందని భావిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు పేలుడు శక్తి (దాదాపు 15 కిలో టన్నుల టీఎన్టీ)కంటే ఇది వందల రెట్లు ఎక్కువని చెప్పారు.
అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వాతావరణంలో 40 కిలోమీటర్ల మేర బూడిద, పొగ వ్యాపించినట్లు నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ పేలుడు తీవ్రతకు టోంగా ద్వీపంలోని 65 కిలోమీటర్ల మేర ప్రాంతం తుడిచిపెట్టుకుపోయినట్లు చెప్పింది. ‘ఈ ఘటన.. టోంగాను విషపూరిత బూడిదతో కప్పేసింది. నీటి వనరులను కలుషితం చేసింది. పంటలు నాశనమయ్యాయి. రెండు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి’ అని వెల్లడించింది. స్థానికులు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హానికర బూడిద కారణంగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రక్షణ దళాలు.. టోంగాకు అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడంలో నిమగ్నమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.