Donald Trump: తాలిబన్ నేతకు అతడి ఇంటి ఫొటో పంపించి బెదిరించా: ట్రంప్
తాలిబన్లతో చర్చల సందర్భంగా తాను ఆ ముఠా అగ్ర నాయకుడిని గట్టిగా బెదిరించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్లతో చర్చల సందర్భంగా తాను ఆ ముఠా అగ్ర నాయకుడిని గట్టిగా బెదిరించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ నాయకుడి ఇంటి శాటిలైట్ ఫొటోను పంపించి హెచ్చరించానని అన్నారు. ఓ అమెరికా వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాలిబన్లతో చర్చలు జరిపా. ఆ సమయంలో ఓసారి తాలిబన్ ఉగ్ర ముఠా సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్కు ఆయన ఇంటి శాటిలైట్ ఫొటోను పంపించా. ‘మా ఇంటి ఫొటోను ఎందుకు పంపించారు?’’ అన బరాదర్ అడిగాడు. అప్పుడు అతడికి నేను ఒకటే చెప్పా.. ‘మా సైనికుల్లో ఇంక్కొక్క ప్రాణం పోయినా.. మిమ్మల్ని ఏ దేశమూ చేయని విధంగా గట్టిగా దెబ్బకొడతాం’ అని అన్నా. దాంతో అతడు భయపడి వెనక్కి తగ్గాడు’’ అని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనిక ఉపసంహరణపై ట్రంప్ విమర్శలు చేశారు. తాను అధ్యక్ష హోదాలో ఉంటే బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా సైనిక పరికరాలను ఆ దేశంలో వదిలివచ్చేందుకు అంగీకరించేవాడిని కాదన్నారు. అంతేగాక, బైడెన్ అనాలోచిత ఉపసంహరణ ప్రక్రియ కారణంగా అమెరికా 13 మంది సైనికులను కోల్పోయిందని, ఎంతో మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని విచారం వ్యక్తం చేశారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత అఫ్గాన్ గడ్డ నుంచి అమెరికా గతేడాది రక్షణ దళాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో అఫ్గాన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల అరాచక పాలనకు భయపడి లక్షలాది మంది దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం అక్కడ తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ట్రంప్ బెదిరించిన అబ్దుల్ ఘనీ బరదార్ ఇప్పుడు అఫ్గాన్ ఉపప్రధానిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్