TTP: కాల్పుల విరమణ నుంచి బయటకు.. పాక్లో దాడులకు ఆదేశాలిచ్చిన ఉగ్రసంస్థ!
పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము విరమించుకున్నట్లు నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్(TTP) ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడాలంటూ తమ ఫైటర్లకు ఆదేశించినట్లు సోమవారం వెల్లడించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము విరమించుకున్నట్లు నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్(TTP) ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడాలంటూ తమ ఫైటర్లకు ఆదేశించినట్లు సోమవారం వెల్లడించింది. పాక్(Pakistan)లోని వివిధ ప్రాంతాల్లో ముజాహిదీన్లకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాయుధ పోరాటం ద్వారా పాకిస్థాన్లో అధికారంలోకి రావాలని భావిస్తోన్న ఈ సంస్థ.. వరుస దాడులతో ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్లో పాక్ ప్రభుత్వానికి, టీటీపీకి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దీన్ని ఉల్లంఘించారంటూ ఇరుపక్షాలు పలు సందర్భాల్లో పరస్పరం ఆరోపించుకున్నాయి.
‘తెహ్రీక్ ఏ తాలిబన్’ వివిధ ఇస్లామిస్ట్ సాయుధ మిలిటెంట్ల కూటమి. దీన్ని పాకిస్థాన్ తాలిబన్గా అభివర్ణిస్తారు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా 2007లో బైతుల్లా మెహసూద్ దీన్ని స్థాపించాడు. అఫ్గాన్లో అధికారంలో ఉన్న తాలిబన్లది, టీటీపీది ఒకటే భావజాలం! అల్ఖైదాతోనూ సంబంధాలు ఉన్నాయి. టీటీపీ సభ్యులు అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో దాక్కుని పాక్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇప్పటివరకు పాకిస్థాన్లో పదుల కొద్దీ హింసాత్మక దాడులకు పాల్పడి, వందలాది ప్రాణాలను బలిగొన్నారు. ముఖ్యంగా పాక్ సైనిక శిబిరాలు, చెక్పోస్ట్లపై మెరుపు దాడులు చేసి, పెద్దసంఖ్యలో సైనికులను హతమార్చారు. పాక్లోని చైనీయులపైనా దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్