Turkey: మృత్యువును గెలిచిన ఈ పసిపాప గుర్తుందా..? ఎట్టకేలకు తల్లి చెంతకు
తుర్కియేలో భూకంప శిథిలాల్లో చిక్కుకుని.. 128 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన చిన్నారి గుర్తుందా..! ఎట్టకేలకు ఆ పసిపాపను ఆమె తల్లి చెంతకు చేర్చారు.
అంకారా: దాదాపు రెండు నెలల క్రితం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ధాటికి తుర్కియే (Turkey), సిరియా (Syria)లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి ఇరు దేశాల్లో దాదాపు 57వేలకు పైగా మృతి చెందారు. ఒక్క తుర్కియేలోనే 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల క్రమంలో భూకంపం ధాటికి నేలకూలిన భవనాల శిథిలాలనుంచి అనేక మందిని ప్రాణాలతో వెలికితీశారు. తుర్కియేలోని హతాయ్లో ఓ రెండు నెలల పసిపాప.. ఏకంగా 128 గంటల తర్వాత మృత్యుంజయురాలిగా బయటపడి, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటో అప్పట్లో నెట్టింట వైరల్గా మారింది. అయితే, పాప తల్లి ఈ ఘటనలో మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ, ఆమె బతికే ఉన్నట్లు ఇటీవల తెలిసింది.
దీంతో తాజాగా శిశువును తల్లి చెంతకు చేర్చారు. ఉక్రెయిన్ మంత్రి ఆంటన్ గెరాషెంకో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘తుర్కియేలో భూకంప శిథిలాల కింద 128 గంటలపాటు ప్రాణాలతో నిలదొక్కుకున్న పాప బహుశా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె తల్లి మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆమె బతికే ఉన్నారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 54 రోజుల తర్వాత.. డీఎన్ఏ పరీక్ష అనంతరం బిడ్డను తల్లి చెంతకు చేర్చారు’ అని గెరాషెంకో ట్వీట్ చేశారు. అంతకుముందు తుర్కియే కుటుంబ, సామాజిక సేవల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమంటూ అభివర్ణించారు. ప్రపంచంలో ఎంతో అద్భుతం ఏంటంటే.. తల్లి, బిడ్డను కలపడమేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్