Earthquake: భూ ప్రళయం.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరిగిన మృతులు
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భవన శిథిలాల కింద నిత్యం వందలాది శవాలు బయటపడుతుండటం కలచివేస్తోంది.
అంకారా: ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుతో కకావికలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎటు చూసినా శిథిలాల గుట్టలు.. శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. నిమిష నిమిషానికి వందలాది మృతదేహాలు బయట పడుతుండటంతో అక్కడి నెలకొన్న పరిస్థితులు హృదయాలను మెలిపెడుతున్నాయి. ఈ భూ ప్రళయం కారణంగా ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 20వేలకు చేరువలో ఉంది. తుర్కియేలో ఇప్పటివరకు 16,100 మందికి పైగా మృతిచెందగా.. 64వేల మంది గాయపడినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వెల్లడించారు. అలాగే, సిరియాలో ఇప్పటివరకు 3,100 మంది మృతిచెందగా.. 5వేల మందికి పైగా గాయపడి చికిత్సపొందుతున్నట్టు సమాచారం.
తుర్కియేలో ఇప్పటివరకు 16,100 మంది ఈ ప్రకృతి ప్రకోపానికి బలైపోగా. 64వేల మంది గాయపడినట్టు దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ వెల్లడించారు. గురువారం ఆయన గాంజియాతెప్ ప్రాంతంలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక, పొరుగున ఉన్న సిరియాలో మరో 3,100 మందికి పైగా మృతిచెందారు. దీంతో ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19,200కు పైగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారి సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ.. పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బలగాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ.. వరుసగా వస్తున్న ప్రకంపనలు, వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగిస్తున్నాయి.
1117 సార్లు కంపించిన భూమి..
గత సోమవారం 7.8తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత నుంచి అనేక సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తుర్కియేలో ఇప్పటివరకు 1117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.
అవును.. లోపాలున్నాయి: ఎర్డోగాన్
సోమవారం నాటి భూకంపం ధాటికి ఎక్కువగా నష్టపోయింది తుర్కియేనే. దాదాపు 10 ప్రావిన్స్లు ఇప్పుడు నామరూపాల్లేకుండా మారిపోయాయి. ఒక్కో భవన శిథిలాల కింద 400-500 మంది చిక్కుకుపోగా.. వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు కూడా లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ ఘోర విపత్తును ముందే ఊహించిన సిద్ధపడటం సాధ్యం కాదన్నారు. ‘‘అవును. కొన్ని లోపాలున్నాయి. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మనందరికీ కన్పిస్తూనే ఉంది. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు’’ అని తెలిపారు.
తుర్కియేలోని అంటాక్య నగరంలో భూకంపానికి ముందు.. తర్వాత (శాటిలైట్ చిత్రాలు)
ట్విటర్పై ఆంక్షలు..
మరోవైపు తుర్కియే ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో రాజధాని అంకారా సహా పలు నగరాల్లో ట్విటర్ (Twitter)పై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తుర్కిష్ మొబైల్ నెట్వర్క్ల్లో ట్విటర్ పనిచేయడం లేదని నెట్బ్లాక్స్ అనే వెబ్ మానిటరింగ్ సంస్థ వెల్లడించింది. అసత్య ప్రచార వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పిల్లల దుస్తులను కాల్చుతూ..
భూకంపం ధాటికి సర్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడ్డకట్టే చలిలో వారంతా ఇప్పుడు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు వెచ్చదనం కోసం పార్కుల్లోని బెంచీలు, పిల్లల దుస్తులను కాల్చేస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో కన్పిస్తున్నాయి. ఈ విషాదానికి అంతమెక్కడో తెలియక తుర్కియే వాసులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు