Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
తుర్కియే(Turkey), సిరియా(Syria)లో బాధితులను కాపాడగలమన్న ఆశలు కరిగిపోతున్నాయి. భూకంప (Earthquake)సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు నేటి ఉదయంతో పూర్తయ్యాయి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంప (Earthquake) బాధితులను కాపాడే అవకాశాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఒక్క తుర్కియే(Turkey)లోనే భూకంపం కారణంగా 2,000 భవనాలు కూలినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే.. అనధికారికంగా ఆ దేశ 10 ప్రావిన్స్ల్లో కలిపి ధ్వంసమైన భవనాల సంఖ్య 6,000 పైనే ఉంటుందని అంచనా. వీటిల్లో ఆసుపత్రులు, పబ్లిక్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇరు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య ఇప్పటికే 15,000 దాటేసింది. విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు కూడా దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సాయం అక్కడకు చేరడం కష్టతరంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి అత్యంత విలువైన 72 గంటల కాలం కరిగిపోయింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుందనే భయాలు నెలకొన్నాయి.
తొలి 72 గంటలే ఎందుకు కీలకం..?
సాధారణంగా భూకంపం (Earthquake) నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని యూనివర్శిటీ కాలేజి లండన్కు చెందిన డిజాస్టర్ అండ్ హెల్త్ విభాగ ప్రొఫెసర్ ఇలాన్ కెల్మన్ చెబుతున్నారు. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకొన్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. ఈ ప్రమాణాలు మొత్తం తుర్కియే(Turkey) - సిరియా(Syria)లో చాలా ప్రతికూలంగా ఉన్నాయి. గురువారం ఉదయంతో 72 గంటల కాలం ముగిసిపోయింది.
హైపోథెర్మియా కలిగించేలా వాతావరణం..
ప్రస్తుతం భూకంపం (Earthquake) సంభవించిన ప్రదేశంలోని వాతావరణం కూడా సహాయక చర్యలకు ఏమాత్రం సహకరించడంలేదు. గడ్డకట్టుకుపోయే చలితో ఈ ప్రాంతంలో మంచుపడుతోంది. దీంతో హైపోథెర్మియా పరిస్థితులు నెలకొన్నాయి. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే.. ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉండే పరిస్థితిని హైపోథెర్మియా అంటారు. ఈ స్థితిలో శరీరం వేగంగా చల్లబడిపోతుంది. ఈ స్థితిలో శరీర ఉష్ణోగ్రత 95 ఫారన్ హీట్ కంటే తక్కువకు పడిపోతుంది. ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత 98.8 ఫారన్ హీట్ ఉంటుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో గాయాలతో జీవించాలంటే ఆహారం, నీరు కచ్చితంగా ఉండాలి. నీరు లేకపోవడంతో చాలా మంది భూకంప బాధితులు 3వ రోజు నుంచి 5వ రోజులోపు చనిపోతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్థానికులు చేసే ప్రయత్నాలే కీలకం..
భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. ప్రస్తుతం తుర్కియే(Turkey)-సిరియా(Syria)కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకొచ్చాయి. కానీ, భూకంపం (Earthquake) వచ్చింది మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు కావడంతో సహాయక బృందాలు చేరుకొని పని మొదలు పెట్టడానికి ఎంతలేదన్నా 24గంటల సమయం పట్టింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న చాలా మందిని ప్రకృతి బలిగొంది. ఇక సిరియా సరిహద్దుల్లో యుద్ధక్షేత్రానికి ఇప్పటికీ సహాయక బృందాలను పూర్తిగా రానీయడం లేదు.
మెక్సికో డాగ్ స్క్వాడ్ చాలా ప్రత్యేకం..
శిథిలాల కింద బాధితులను గుర్తించడానికి చాలా విధానాలను అనుసరిస్తారు. వీటిల్లో వాసన పసిగట్టే జాగిలాలను వినియోగించడం కూడా ఓ విధానం. దీనిలో మెక్సికోకు చెందిన డాగ్స్క్వాడ్కు ప్రత్యేకమైన పేరుంది. ఈ బృందాల్లో బెల్జియన్ మాలినోయిస్, ఆస్ట్రేలియా షీప్డాగ్స్, లాబ్రడార్స్ జాతి శునకాలు ఉంటాయి. మెక్సికోలో కూడా భూకంపాలు (Earthquake) సర్వసాధారణం. దీంతో అక్కడ శిథిలాల కింద వారిని గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇస్తారు. 2017లో భూకంప బాధితులను గుర్తించడంలో ఈ శునకాలు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో ఫ్రిదా అనే జాగిలం ఏకంగా 43 మంది ప్రాణాలు కాపాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మెక్సికో, భారత్, క్రొయేషియా, చెక్రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, లిబియా, పోలాండ్, స్విట్జర్లాండ్, యూకే, అమెరికా దేశాలు తమ శునకాల బృందాలను పంపాయి.
ఇక శిథిలాల్లోని ఇరుకు సందుల్లో బాధితులను గుర్తించేందుకు రోబోలు, డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఒక్కసారి అక్కడ బాధితులను గుర్తించాక వారిని రక్షించేందుకు అవసరమైన క్రేన్లు ఇతర పరికరాలను మోహరిస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుల అవయవాలను కత్తిరించాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటాయి.
ఒక్క ప్రాణం కాపాడటానికి 10 లక్షల డాలర్లు..
భూకంపంలో మృతుల సంఖ్య తగ్గించడానికి చర్యలు కొన్నేళ్ల ముందుగానే తీసుకోవాలి. ఆ ప్రదేశాల్లో భూకంపాలను తట్టుకొనే ప్రమాణాలతోనే నిర్మాణాలు చేపట్టాలి. ఇది ముందు జాగ్రత్త చర్య. ఇక భూకంపం వచ్చాక శిథిలాల కింద బాధితులను కాపాడేందుకు అత్యంత ఖరీదైన ఆపరేషన్లు చేపట్టాల్సి ఉంటుంది. తుర్కియే(Turkey)-సిరియా(Syria)ల్లో ఒక్కో మనిషిని కాపాడటానికి సగటున 10 లక్షల డాలర్లు ఖర్చు కావొచ్చని డిజాస్టర్ అండ్ హెల్త్ విభాగ ప్రొఫెసర్ ఇలాన్ కెల్మన్ పేర్కొన్నారు. విపత్తులకు ముందే మేలుకొంటే ఈ పరిస్థితి రాదని ఆయన వివరించారు. శిథిలాల కింద చిక్కుకొని ప్రాథమిక అవసరాలు అందకపోతే వారు మనుగడ కోసం పోరాడే సమయం వేగంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలో తొలి 72 గంటలే కీలకమని ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయ విపత్తు నిపుణుడు స్టీవెన్ గాడ్బీ కూడా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ